CM Chandrababu: ఏపీకి ఆర్థిక చేయూత కావాలని కేంద్ర మంత్రులను కోరిన సీఎం చంద్రబాబు

ఏపీకి కేంద్రం చేయూత కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి దిల్లీలో పర్యటిస్తూ కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు.

Published : 05 Jul 2024 10:12 IST

ఏపీకి కేంద్రం చేయూత కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి దిల్లీలో పర్యటిస్తూ కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరిన చంద్రబాబు.. బీపీసీఎల్‌ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మరికొందరు కేంద్రమంత్రులు, నీతీ ఆయోగ్ సీఈవోతో పాటు పలు దేశాల రాయబారులు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Tags :

మరిన్ని