Anantapur: చౌకగా మగ్గం వర్క్‌ చేస్తున్నారని.. దుకాణాలపై మహిళా డిజైనర్ల దాడి

అనంతపురంలోని కోల్‌కతా ఫ్యాషన్ డిజైనర్లపై మహిళా డిజైనర్లు దాడులు చేశారు. చౌకగా మహిళల బ్లౌజ్ డిజైన్లు చేస్తున్న 20 మంది మగ్గం వర్కర్ల దుకాణాలను ధ్వంసం చేశారు.

Published : 28 Jun 2024 19:14 IST

అనంతపురంలోని కోల్‌కతా ఫ్యాషన్ డిజైనర్లపై మహిళా డిజైనర్లు దాడులు చేశారు. చౌకగా మహిళల బ్లౌజ్ డిజైన్లు చేస్తున్న 20 మంది మగ్గం వర్కర్ల దుకాణాలను ధ్వంసం చేశారు. కోల్‌కతా నగరంలో జీవనోపాధి లేక 2 దశాబ్దాలు క్రితం పొట్ట చేతపట్టుకొని అనంత నగరంలోని రహమత్ నగర్‌లో నాణ్యమైన డిజైన్లను చౌకగా చేస్తున్నారు. వీరి చేతిపనికి విపరీతమైన ఆదరణ పెరగడంతో మరికొందరు కూలీలతో పెద్దఎత్తున డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు. అధిక ధరలతో డిజైనింగ్ చేస్తున్న స్థానిక మహిళా డిజైనర్లు ఇదంతా సహించలేక.. కోల్‌కతా డిజైనర్ల దుకాణాల వద్ద ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. నగరం వదిలి వెళ్లకపోతే ఈసారి మగ్గాలు విరిచేస్తామని మహిళలు బెదిరించారని బాధితులు వాపోయారు. బాధితులు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

మరిన్ని