Peddapalli: మానేరు వాగు వంతెనపై మరోసారి కూలిన గైడర్లు

పెద్దపల్లి జిల్లా ఓడేడ్‌ గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన 5 గైడర్లు కూలిపోయాయి.

Published : 03 Jul 2024 16:25 IST

పెద్దపల్లి జిల్లా ఓడేడ్‌ గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన 5 గైడర్లు కూలిపోయాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 22న అర్ధరాత్రి గైడర్లు కూలిపోయాయి. మళ్లీ 70 రోజుల వ్యవధిలో మరోసారి వంతెన కూలిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మానేరు వాగుపై 2016 ఆగస్టులో రూ.49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం 2023-24లో మరో రూ.11 కోట్ల నిధులను అదనంగా కేటాయించారు. తొమ్మిదన్నరేళ్లు కావొస్తున్నా వంతెన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.

Tags :

మరిన్ని