Ramoji Rao: రామోజీరావుకు నివాళులు అర్పించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్‌లోని కానూరులో జరుగుతోంది. రామోజీరావు చిత్ర పటానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

Published : 27 Jun 2024 17:22 IST

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్‌లోని కానూరులో జరుగుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఈ సభకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావు చిత్ర పటానికి వారంతా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అంతకు ముందు రామోజీరావు కుటుంబసభ్యులను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయంగా పలకరించారు.

Tags :

మరిన్ని