Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర.. కశ్మీర్‌కు చేరుకున్న మొదటి యాత్రికుల బృందం

ఏటా వైభవంగా సాగే అమర్‌నాథ్ యాత్ర కోసం మెుదటి యాత్రికుల బృందం కశ్మీర్‌కు చేరుకుంది. జమ్మూకశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ బృందం నేడు బయలుదేరనుంది.

Published : 29 Jun 2024 12:29 IST

ఏటా వైభవంగా సాగే అమర్‌నాథ్ యాత్ర కోసం మెుదటి యాత్రికుల బృందం కశ్మీర్‌కు చేరుకుంది. జమ్మూకశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉన్న అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ బృందం నేడు బయలుదేరనుంది. జమ్మూలోని భాగవతి నగర్ క్యాంపు నుంచి యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అటు వరుస ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఈ యాత్రకు అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.

Tags :

మరిన్ని