Seethakka: పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: మంత్రి సీతక్క

అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

Published : 04 Jul 2024 17:32 IST

అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ట్యాంక్ బండ్‌పై ఉన్న అల్లూరి విగ్రహం వద్ద క్షత్రియ సేవ సమితి నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి సీతక్క, సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి పాల్గొన్నారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు అల్లూరి సీతారామ రాజు అని మంత్రి సీతక్క అన్నారు. ఆయన పోరాటాలు, త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి.. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని