Seethakka:: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: మంత్రి సీతక్క

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సీతక్క తెలిపారు.

Published : 13 Jun 2024 15:27 IST

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. ములుగు జిల్లా జీవంతరావుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి.. పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాలల్లో సదుపాయాల విషయంలో అధికారులు నిర్లక్ష్యధోరణి ప్రదర్శించ వద్దని మంత్రి సూచించారు. బడి బాగుంటేనే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు పడతాయన్నారు.

Tags :

మరిన్ని