AP News: ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి ఘటనలో నిందితులకు 14రోజుల రిమాండ్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురు నిందితులకు మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధించింది.

Published : 04 Jul 2024 09:38 IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురు నిందితులకు మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. రెండు రోజుల క్రితం దాడి సమయంలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు సేకరించారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా మొత్తం 70 మందికిపైగా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ఐదుగురు వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

మరిన్ని