వైకాపా పాలనలో నరకం అనుభవించాం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉపాధ్యాయులు

గత తెలుగుదేశం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఇచ్చిన ఉద్యోగాలను వైకాపా సర్కారు తొలగించిందంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 29 Jun 2024 15:36 IST

గత తెలుగుదేశం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఇచ్చిన ఉద్యోగాలను వైకాపా సర్కారు తొలగించిందంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పని చేయించుకున్న కాలానికి కూడా వేతనాలు ఇవ్వకుండా నరకం చూపించారంటూ ఆవేదన వెలిబుచ్చారు. పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేసిన తాము వైకాపా ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉపాధి కోల్పోయి దుర్భర జీవితం గడుపుతున్నామని వాపోయారు. తమ బాధలు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదుకుంటామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. హామీలు వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉండవల్లిలోని సీఎం నివాసానికి బాధితులు పెద్ద ఎత్తున వచ్చారు. 

Tags :

మరిన్ని