Fire Accident: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురి మృతి

తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కర్మాగారంలోని మూడు గదులు నేలమట్టమయ్యాయి.

Updated : 29 Jun 2024 16:24 IST

తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కర్మాగారంలోని మూడు గదులు నేలమట్టమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాణసంచా తయారీకి వినియోగించే ముడి రసాయన పదార్థాల కారణంగా ప్రమాదం సంభవించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో కర్మాగారంలో 50 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు.

Tags :

మరిన్ని