Byreddy shabari: వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ రాలేదు: ఎంపీ బైరెడ్డి శబరి

వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. 

Updated : 02 Jul 2024 18:57 IST

వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్‌సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. తెదేపా హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ఇవాళ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వైకాపా అధికారంలోకి రాగానే మూడు రాజధానులని మాట మార్చింది. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ ఎక్కడా ఒక్క ఇటుక పేర్చలేదు. తెదేపా హయాంలో పోలవరం నిర్మాణం 70 శాతం పూర్తయితే వైకాపా ప్రభుత్వం ఒక్క శాతం పనులు కూడా చేయలేకపోయింది.

Tags :

మరిన్ని