T20 World Cup Final: చివరి బంతి పడగానే భారత ఆటగాళ్ల సంబరాలు ఇవీ..

టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ రెండో సారి సగర్వంగా ముద్దాడింది. భారత్‌ విజయం సాధించడంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు.  

Published : 30 Jun 2024 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమ్‌ఇండియా రెండో సారి పొట్టికప్పును ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి వరకు అత్యంత ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో భారత్‌ 7వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. ఇక స్టేడియంలో ఉన్న భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చివరి బంతి పూర్తవగానే ఆటగాళ్లతోపాటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న కోచ్‌లు, సిబ్బంది తీవ్ర భావోద్వేగాలతో ఒకరినొకరు హత్తుకుంటూ ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు