IND vs ENG: రోహిత్‌ హిట్టింగ్‌.. అక్షర్‌ టర్నింగ్‌.. మ్యాచ్‌ హైలైట్స్‌ అదుర్స్

టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా దూసుకుపోయింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను అలవోకగా చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ రేసులో నిలిచింది.

Updated : 28 Jun 2024 06:51 IST

రోహిత్‌సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫామ్‌ను కొనసాగిస్తూ రోహిత్‌ శర్మ (57; 39 బంతుల్లో 6×4, 2×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (47; 36 బంతుల్లో 4×4, 2×6) కూడా రాణించాడు. అనంతరం స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), అక్షర్‌ పటేల్‌ (3/23) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరూ చూసేయండి

Tags :

మరిన్ని