Seethakka: మహిళలకు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యం: మంత్రి సీతక్క

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి సీతక్క (Seethakka) పునరుద్ఘాటించారు.

Published : 16 Jun 2024 11:19 IST

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి సీతక్క (Seethakka) పునరుద్ఘాటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మహిళలకు రూ. 20వేల కోట్లను స్వయం సహాయక సంఘాలను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు- బ్యాంక్ లింకేజీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.

Tags :

మరిన్ని