Assam Flood: అసోంలో వరద బీభత్సం.. 45 మంది మృతి

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఆరున్నర లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి.

Published : 02 Jul 2024 16:00 IST

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఆరున్నర లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. దిబ్రూగఢ్ జిల్లాలో నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన 13 మంది మత్స్యకారులను భారత వైమానిక దళం కాపాడింది. హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. గువహటిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవతా విగ్రహాలు మునిగిపోయాయి. ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా అసోంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. లఖింపుర్ జిల్లాలో లక్షా 43 వేల మందికి పైగా ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 72 పునరావాస శిబిరాల్లో 8 వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు. 

Tags :

మరిన్ని