Ap News: విశాఖలో అక్రమ టోల్ వసూళ్లకు తెర.. హర్షం వ్యక్తం చేసిన ప్రయాణికులు

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు తెరపడింది.

Published : 28 Jun 2024 16:12 IST

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు తెరపడింది. అగనంపూడి టోల్‌గెట్‌ను గురువారం తొలగించటంతో ప్రయాణికులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నుంచి టోల్ నిర్వహణను గుత్తకు తీసుకున్న సంస్థ ఏటా అధిక ఛార్జీలు వసూళ్లు చేసేది. 2019 ఎన్నికల ముందు తెదేపా హయాంలో మూసివేసిన టోల్‌ను అధికారంలోకి వచ్చిన వైకాపా పునరుద్ధరించింది. టోల్‌గేట్ తీసివేయాలని పలుమార్లు స్థానికులు అప్పటి ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన నెలలోపు టోల్‌గేటు తొలగించేశారు. ప్రభుత్వ తీరును స్థానిక ప్రజలు మెచ్చుకుంటున్నారు.

Tags :

మరిన్ని