Ap News: పారిశ్రామికవాడలో తెరుచుకోనున్న మూతపడ్డ పరిశ్రమ

వైకాపా ప్రభుత్వంలో వేధింపులు తట్టుకోలేక మూతపడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుకుంటున్నాయి.

Updated : 04 Jul 2024 17:59 IST

వైకాపా ప్రభుత్వంలో వేధింపులు తట్టుకోలేక మూతపడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో.. గత తెలుగుదేశం హయాంలో అశోక్ లేల్యాండ్ సంస్థ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. వైకాపా ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక వ్యతిరేక విధానాలతో సంస్థను మూతేసింది. అయితే ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ చర్చల నేపథ్యంలో ఆగస్టు రెండవ వారం నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు యాజమాన్యం ముందుకు వచ్చింది. 

Tags :

మరిన్ని