AP News: దస్త్రాల కాల్చివేతలో ఇద్దరు అరెస్టు

కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై తగులబెట్టడం కలకలం రేపింది.

Published : 04 Jul 2024 15:02 IST

కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై తగులబెట్టడం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంవోకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలి హార్డ్ డిస్కులు ఉన్నట్లు తెలుస్తోంది. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

మరిన్ని