Anitha: పిన్నెల్లికి జగన్‌ పరామర్శ.. రూ.25 లక్షలు ఖర్చు చేసిన మాజీ సీఎం: హోంమంత్రి అనిత

ఈవీఎం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు.

Updated : 04 Jul 2024 20:14 IST

ఈవీఎం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్‌ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన హెలికాప్టర్‌లో నెల్లూరు జైలుకు వెళ్లారని చెప్పారు. జైలులో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖత్‌లు అయిపోయాయని, మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా జగన్‌.. ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందన్నారు.

Tags :

మరిన్ని