- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
India-China: పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
India-China: విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈసందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు.
బీజింగ్: వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత (India) విదేశాంగ విధానంలో ప్రధానమైన పంచశీల ఒప్పందాన్ని (Panchsheel Agreement) ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి ఆ ఐదు సూత్రాలు మెరుగ్గా పని చేస్తాయన్నారు.
భారత్ - చైనా (India-China) మధ్య కుదిరిన ఒప్పందాన్ని ‘పంచశీల ఒప్పందాని’కి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిన్పింగ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామం. శాంతి, అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిచ్చాయి. చైనా-భారత్, చైనా-మయన్మార్తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను మా గత నాయకత్వం చేర్చింది. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది’’ అని జిన్పింగ్ (Xi Jinping) గుర్తుచేశారు.
‘‘మొదట ఈ పంచశీల ఒప్పందం ఆసియాలో పుట్టింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1960ల్లో మొదలైన అలీనోద్యమానికీ ఈ ఐదు సూత్రాలు మార్గదర్శకంగా నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ చట్టాలకు ఈ సూత్రాలు ఓ ప్రమాణాన్ని నిర్దేశించాయి. వర్తమాన సంఘర్షణలను అంతం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. ప్రపంచ భద్రత కోసం మేం తీసుకొస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్లోనూ ఈ విధానాలను అనుసరించాలనుకుంటున్నాం’’ అని చైనా (China) అధినేత వెల్లడించారు.
ఏంటీ పంచశీల ఒప్పందం..
పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో భారత్ - చైనా మధ్య ఈ ఒప్పందం (Panchsheel Agreement) కుదిరింది. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru), చౌ-ఎన్లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.
దీనిలోని అంశాలు:
- సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించడం.
- ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం.
- దాడులు, ఆక్రమణలకు దిగకపోవడం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం.
- అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర గౌరవం, సహకారం కోసం కృషి చేయడం.
- పొరుగు దేశాలతో శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!
చైనాలో ప్రయోగానికి సిద్ధం చేస్తున్న ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి సమీపంలోని కొండల్లో పడింది. ఆ వీడియో వైరల్గా మారింది. -
బైడెన్ వైదొలగాల్సిందే
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. -
పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు
రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. -
ఫ్రాన్స్లో పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి
ఫ్రాన్స్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్ పోలింగ్ పూర్తయింది. -
భీకర హరికేన్ ముప్పు అంచున ఆగ్నేయ కరేబియా ప్రాంతం
ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం భీకర హరికేన్ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ దాని అనుకుని ఉన్న హరికేన్ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. -
బొమ్మ తుపాకీతో పోలీసులకు బెదిరింపు
పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురి మృతి
దక్షిణ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు. -
నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు
నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. -
సూడాన్లో సైన్యంతో సాయుధ ఘర్షణ
సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. -
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!
-
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
-
తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున