- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
India-Pak Ties: భారత్-పాక్ సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే?
భారత్-అమెరికాల మధ్య ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అనేక అంశాల్లో భారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నామని అగ్రరాజ్యం పేర్కొంది. ముఖ్యంగా ఆర్థిక, భద్రతా రంగాల్లో ఎంతో సహకారం ఉందని, ఇదే ఒరవడిని ఇకముందు కొనసాగిస్తామని స్పష్టంచేసింది. భారత్-పాక్ సంబంధాలపై స్పందిస్తూ.. ఉగ్రవాదం ఉన్నంతకాలం శత్రుదేశంతో చర్చలు జరపలేమని భారత్ చెప్పిన విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మరోసారి గుర్తుచేసింది.
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
‘‘భారత్-పాక్ మధ్య ఉగ్రవాదం అంశం ప్రధానంగా కొనసాగుతోంది. ఏ దేశమైనా వారి పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటే స్వాగతిస్తాం. కానీ, ఉగ్రవాదం విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. భూమి మీద ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ దేశమైనా ఖండించాల్సిందే’’ అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధాలు, భద్రతా సహకారంతోపాటు పలు రంగాల్లో భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నామన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు కూడా ఇటీవల భారత్లో పర్యటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన జీ7 సదస్సులోనూ ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం అధ్యక్షుడు జో బైడెన్కు వచ్చిందన్నారు.
పొరుగుదేశంతో భారత్ సత్సంబంధాలు కోరుకుంటుందని, ఇదే సమయంలో ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి కొనసాగలేవని ప్రధాని మోదీ పలుమార్లు స్పష్టంచేశారు. ఇదే విషయంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి పైవిధంగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!
అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ఆంక్షలతో మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. వారి పాలనతో ఎంతోమంది మహిళలు తమ కలలను చంపుకొని వంట గదికి పరిమితమవుతున్నారు. దీంతో శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించింది. -
ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు
Myanmar: తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచారని కొందరు దుకాణదారులకు జైలు శిక్ష విధించారు. ఈ వింత ఘటన మయన్మార్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..? -
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) అధ్యక్ష అభ్యర్థిగా నిలుస్తారా..?అనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris ) భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. -
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
Hurricane Beryl: బెరిల్ హరికేన్ కరీబియన్ దీవుల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్లోని ‘యూనియన్ ఐలాండ్’ (Union Island) దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. -
అందుకే తడబడ్డాను.. ట్రంప్తో సంవాదంపై బైడెన్
Biden Trump Debate: ట్రంప్తో ఇటీవల జరిగిన సంవాదంలో అధ్యక్షుడు బైడెన్ కాస్త తడబడిన విషయం తెలిసిందే. అయితే, దానికి కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. -
17.42 గంటల్లో ఇంగ్లిష్ ఛానల్ ఈదిన భారత మాతృమూర్తి
ఇంగ్లిష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వీ చవాన్ దేవరె (33) రికార్డు సృష్టించారు. -
స్పెయిన్ విమానంలో కుదుపులు.. ఆగమాగమైన ప్రయాణికులు
గగనతలంలో వెళుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి అమాంతం ఎగిరిపడ్డారు. -
నేపాల్లో కూలనున్న ప్రచండ సర్కారు
నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. -
సంక్షిప్త వార్తలు
నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా. -
ఖాన్ యూనిస్లో విధ్వంసం
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపు దాడికి దిగాయి. -
ఉక్రెయిన్కు మరో 230 కోట్ల డాలర్ల భద్రతా సాయం: అమెరికా
ఉక్రెయిన్కు త్వరలో 230 కోట్ల డాలర్ల అదనపు భద్రతా సాయాన్ని చేయనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. దీనికింద ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, -
మోదీ, పుతిన్లు ఏదైనా చర్చించొచ్చు: క్రెమ్లిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. -
‘పశ్చాత్తాప పడే పని చేయవద్దు’ - ఓటర్లకు రిషి సునాక్ పిలుపు
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాన మంత్రి రిషి సునాక్.. పశ్చాత్తప పడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు.