- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
USA: జపాన్ బాలికపై అమెరికా సైనికుడి అత్యాచారం: మరోసారి ఒకినావా స్థావరంపై విమర్శలు
జపాన్లో ఒకినావాలోని అమెరికా సైనిక స్థావరంపై మరోసారి తీవ్ర స్థాయి విమర్శలు చెలరేగాయి. అక్కడ అమెరికా సైనికుడు ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా (USA) సైన్యం జపాన్(Japan)లోని ఒకినావా దీవిలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అక్కడ ఓ బాలికపై అగ్రరాజ్య సైనికుడు అత్యాచారం చేయడంతో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అతడిని అదుపులోకి తీసుకొన్న జపాన్ అధికారులు తాజాగా నేరాభియోగాలు నమోదుచేసినట్లు వెల్లడించారు.
2023 డిసెంబర్ 24న ఓ అమెరికా సైనికుడు విధి నిర్వహణ ముగించుకొన్న సమయంలో స్థానిక పార్క్లో జపాన్కు చెందిన బాలికతో మాట్లాడాలి కారులోకి రమ్మని పిలిచాడు. ఆమె అందులోకి రాగా.. తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయంపై బాలిక కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి ఈ ఏడాది మార్చిలో అదుపులోకి తీసుకొని నేరాభియోగాలను నమోదు చేశారు. తాజాగా ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి హయాషీ బహిర్గతం చేశారు. దర్యాప్తు బృందాలకు ఆ దేశ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. స్థానిక అమెరికా రాయబారి వద్ద కూడా జపాన్ అధికారులు ఫిర్యాదు నమోదు చేశారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని కోరారు. ఇలాంటివి ఇరుదేశాల మధ్య అపనమ్మకాన్ని పెంచుతాయని ఒకినావా గవర్నర్ డెన్నీ టమాకీ పేర్కొన్నారు.
ప్రపంచంలో అమెరికాకు విదేశాల్లో ఉన్న అతిపెద్ద సైనిక స్థావరం ఒకినావా. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ను ఓడించిన తర్వాత దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ 30,000 మందికిపైగా సిబ్బంది విధుల్లో ఉంటారు. తైవాన్పై చైనా దాడి చేస్తే.. ఈ స్థావరమే దానిని అడ్డుకొనేందుకు తొలుత స్పందించాల్సి ఉంటుంది.
- గతంలో కూడా ఇక్కడ అమెరికా సైనికులు చేసిన తప్పుడు పనులపై స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి. 1955లో అమెరికా సైనిక సిబ్బంది వారాల వ్యవధిలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగారు.
- ఇక్కడ 1959లో కదాన్ ఎయిర్ బేస్కు చెందిన ఎఫ్-100 ఫైటర్ విమానం ఎలిమెంటరీ స్కూల్పై పడిపోవడంతో దాదాపు 17 మంది చనిపోగా.. 210 మంది గాయపడ్డారు. నాడు కూడా స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగారు.
- 1970లో ఒకినావా నగరంలో మూడువేల మంది స్థానికులకు, అమెరికా మిలటరీ పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. అగ్రరాజ్య సైనిక వాహనం చేసిన రోడ్డు ప్రమాదమే దీనికి కారణం.
- 1995లో అమెరికా మెరైన్ ఒకరు 12 ఏళ్ల స్థానిక బాలికను అపహరించి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది అతిపెద్ద ఆందోళనలకు కారణమైంది. నిందితుడిని జపాన్లోనే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. 80,000 మంది నాటి ఆందోళనలో పాల్గొనడంతో అంతర్జాతీయ సమాజం దృష్టి దీనిపై పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు రూ.7వేల కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. -
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
India-China: విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈసందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. -
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
ట్రంప్ (Trump)తో జరిగిన సంవాదంలో బైడెన్ (Biden) తడబాటుకు గురయ్యారు. దీని గురించి ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో అధ్యక్షుడు స్పందించారు. -
నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు. -
అణుసామర్థ్య స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తాం
అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికాను హెచ్చరించారు. -
స్మార్ట్ఫోన్ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకం
పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్ఫోన్ వంటి డిజిటల్ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు. -
ఐఎస్ఎస్లో కొద్దిసేపు ఎమర్జెన్సీ
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. -
చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు
చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది. -
అమెరికాలో కొవిడ్ కేసులు
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొవిడ్-19 కేసులు వెలుగుచూస్తుండడంతో ఇక్కడి సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
అమెరికా హెల్త్ కేర్ కుంభకోణంలో హైదరాబాద్ వైద్యుడు
అమెరికాలో చోటుచేసుకున్న భారీ ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) కుంభకోణానికి సంబంధించి ఓ భారతీయుడు, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా 193 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. -
500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం
వాతావరణ మార్పుల వల్ల జూన్లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
నౌకలపై దాడులు ఆపండి
పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలిపివేయాలని హూతీ తిరుగుబాటుదారులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ఓ తీర్మానం ఆమోదించింది. -
బైడెన్, ట్రంప్ వాడీవే‘ఢీ’
ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల చర్చ ఊహించినట్లే వాడీవేడిగా జరిగింది. -
ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్
రిఫార్మ్ పార్టీకి చెందిన ఓ నేత తనపై చేసిన జాత్యాహంకార దూషణలు ఎంతో బాధించాయని, ఆగ్రహం కూడా తెప్పించాయని రిషి సునాక్ పేర్కొన్నారు. -
‘పక్షపాత వైఖరి.. ఓటు బ్యాంకు కోణం’.. అమెరికా నివేదికను ఖండించిన భారత్
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు