- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
UK elections: క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీనిపై ఆయన స్పందించారు.
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు.
‘‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’’ అని సునాక్ తెలిపారు. ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్లోని పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరుతూ.. ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, సునాక్ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం
ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న ఆ పార్టీ.. 400 మార్కు దిశగా పయనిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు దాటింది.
గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్లక్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్లు పడిపోతూ వచ్చాయి.
కీర్ స్టార్మర్ విక్టరీ స్పీచ్..
ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రసంగించారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన తన మద్దతుదారులతో మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘మీ అందరికి కృతజ్ఞతలు. మన దేశాన్ని మీరు మార్చారు. ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచింది. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలుపెడదాం’’ అని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలంటూ ఇజ్రాయెల్లో నిరసనకారులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు. -
ఉక్రెయిన్ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
ఉక్రెయిన్ చేస్తోన్న ప్రతిదాడులతో రష్యాలోని వొరోనెజ్ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి (State of Emergency) విధించారు. -
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
Adult Content: అశ్లీల చిత్రాలు చూసేవారిలో మైనర్ల సంఖ్య పెరుగుతున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు ఓ మొబైల్ యాప్తో పరిష్కారాన్ని సిద్ధం చేసింది. అదేంటి? ఎలా పనిచేస్తుందో చూద్దాం..! -
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
ఓ రకమైన చెక్కను తిని జీవించే పురుగు ఖరీదు ఏకంగా రూ.75 లక్షలు. దానికి అంత ధర ఎందుకో తెలుసా..? -
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
Biden: అధ్యక్ష పోటీ నుంచి బైడెన్ వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో హవాయి గవర్నర్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. -
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’
-
సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు
-
రిషికేశ్లో ఉప్పొంగుతున్న గంగ.. ఘాట్ల వద్దకు వెళ్లొద్దని హెచ్చరికలు
-
‘కల్కి’ మరో రికార్డు.. కమల్హాసన్ డైలాగ్పై సాయిమాధవ్ ఏమన్నారంటే?
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235