Woman: తల్లిదండ్రుల్ని చంపేసి.. ఇంట్లోనే దాచేసి..

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్నే చంపేసింది ఓ మహిళ. వారిని ఇంట్లోనే సమాధి చేసింది. ఏళ్లపాటు అదే ఇంట్లో ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా నెట్టుకొచ్చింది.

Updated : 04 Jul 2024 23:44 IST

లండన్: తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్నే చంపేసింది ఓ మహిళ. వారిని ఇంట్లోనే సమాధి చేసింది. ఏళ్లపాటు అదే ఇంట్లో ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా నెట్టుకొచ్చింది. తల్లిదండ్రులు ఎక్కడికెళ్లారని అడిగితే వాళ్ల ఆరోగ్యం బాగోలేదని, హాలిడే వెకేషన్‌కు వెళ్లారని చెప్పుకొచ్చేది. అసలు విషయం బయటపడటంతో కటాకటాల వెనక్కి వెళ్లింది. ఈ ఘటన యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే... విర్జినియా అనే 36 ఏళ్ల మహిళ 2019 జూన్‌ 17-20 తేదీల మధ్య తన తల్లిదండ్రులు లోయిస్‌ మెక్‌కుల్లాహ్‌ (71), జాన్‌ మెక్‌కుల్లాహ్‌ (70)లను హత్య చేసింది. ప్రాణాంతకమైన ఇంజెక్షన్లను ఇచ్చి హతమార్చింది. వారి మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టేసింది. ఎప్పటిలాగే ఇంటికి వస్తూ పోతూ ఉండేది. 

ఏళ్లు గడుస్తున్నా ఆ వృద్ధులు కనిపించకపోవడంతో వారికి వైద్యం అందించే డాక్టర్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబర్‌ 15, 2023 పోలీసులు అమెను అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్న ఆమె.. తాజాగా నేరాన్ని అంగీకరించింది. తల్లిదండ్రులిద్దర్నీ తానే హత్య చేసినట్లు కోర్టుకు తెలిపింది. దీంతో విచారణను ముగించిన న్యాయస్థానం తీర్పును అక్టోబరు 10, 11 తేదీలకు వాయిదా వేసింది. అయితే, వారిని ఎందుకు హత్య చేసిందన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని