- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
UK elections: బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తంగా 26 మంది భారత మూలాలున్న వ్యక్తులు పార్లమెంటులో అడుగుపెడుతున్నారు.
లండన్: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి హవా కొనసాగింది. దాదాపు 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక తెలుగు సంతతికి చెందిన చంద్ర కన్నెగంటి, ఉదయ్ నాగరాజులు మాత్రం తాజా ఎన్నికల్లో ఓడిపోయారు.
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి అభ్యర్థుల్లో రిషి సునాక్ ముందున్నారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు. మాజీ హోంమంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్లు తమ స్థానాలను పదిలంగా ఉంచుకోగలిగారు. భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో కూడా విజయం సాధించారు. సౌత్వెస్ట్ హెర్ట్ఫోర్డ్షైర్ నుంచి కన్జర్వేటివ్ నేత గగన్ మొహీంద్ర, లైసెస్టర్ ఈస్ట్ నుంచి శివాని రాజా గెలుపొందారు. లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్పై శివాని విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన శైలేష్ వారా, తొలిసారి పోటీలో దిగిన అమీత్ జోగియాలు స్వల్ప తేడాతో ఓటమి చెందారు.
లేబర్ పార్టీ నుంచి..
మొత్తంగా లేబర్ పార్టీ నుంచే భారత సంతతి అభ్యర్థులు అధిక సంఖ్యలో బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిలో సీమా మల్హోత్రా (వాల్సాల్ నియోజకవర్గం), వాలెరీ వాజ్ (బ్లోక్స్విచ్).. ఆమె సోదరి కీత్ వాజ్, లీసా నాండీ (విగాన్)లు భారీ మెజార్టీతో గెలుపొందారు. బ్రిటిష్ సిక్కు ఎంపీలు ప్రీత్ కౌర్ గిల్, తన్మంజిత్ సింగ్ ధేహిలు మరోసారి విజయం సాధించారు. నావెందు మిశ్రా, రదిమా విటోమ్లు లేబర్పార్టీ నుంచి భారీ మెజార్టీతో తమ స్థానాలను పదిలపరచుకున్నారు.
తొలిసారి అడుగుపెడుతూ..
లేబర్ పార్టీకి చెందిన జాస్ అథ్వాల్, బాగీ శంకర్, సత్వీర్ కౌర్, హర్ప్రీత్ ఉప్పల్, వారిందర్ జస్, గురిందర్ జోసన్, కనిష్క నారాయణ్, సోనియా కుమార్, సురీనా బ్రాకెన్బ్రిడ్జ్, కిరిత్ ఎంట్విజిల్, జీవన్ సంధేర్, సోజాన్ జోసెఫ్లు తొలిసారిగా బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వీరితోపాటు లిబరల్ డెమోక్రాట్ తరఫున మునిరా విల్సన్ మరోసారి విజయం సాధించారు.
ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 410 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్లు కేవలం 118 చోట్ల విజయం సాధించారు. రిషి సునాక్ విజయం సాధించగా.. గతంలో 49 రోజుల పాటు ప్రధానిగా పనిచేసిన లిజ్ ట్రస్ మాత్రం ఓటమి పాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలంటూ ఇజ్రాయెల్లో నిరసనకారులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు. -
ఉక్రెయిన్ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
ఉక్రెయిన్ చేస్తోన్న ప్రతిదాడులతో రష్యాలోని వొరోనెజ్ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి (State of Emergency) విధించారు. -
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
Adult Content: అశ్లీల చిత్రాలు చూసేవారిలో మైనర్ల సంఖ్య పెరుగుతున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు ఓ మొబైల్ యాప్తో పరిష్కారాన్ని సిద్ధం చేసింది. అదేంటి? ఎలా పనిచేస్తుందో చూద్దాం..! -
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
ఓ రకమైన చెక్కను తిని జీవించే పురుగు ఖరీదు ఏకంగా రూ.75 లక్షలు. దానికి అంత ధర ఎందుకో తెలుసా..? -
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
Biden: అధ్యక్ష పోటీ నుంచి బైడెన్ వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో హవాయి గవర్నర్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. -
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్సీడబ్ల్యూ ఫిర్యాదు.. ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు
-
జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
-
మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్ ఆరోపణ
-
‘నివేదికను హిండెన్బర్గ్ ముందే లీక్ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’