- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Joe Biden: బైడెన్ వైదొలగాల్సిందే
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
స్వపక్షంలో పెరుగుతున్న డిమాండ్లు
పలు వార్తాసంస్థలదీ అదే మాట
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. పాలక డెమోక్రటిక్ పార్టీలోని పలువురు కీలక నాయకులతోపాటు కొన్ని ప్రముఖ వార్తాసంస్థలూ ఇదే వాణి వినిపిస్తున్నాయి. ‘‘దేశానికి సేవ చేయాలంటే, అధ్యక్ష పదవి రేసు నుంచి బైడెన్ వైదొలగాలి. ఈ దఫా ఆయన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కొనసాగడంలో హేతుబద్ధత ఏమీ లేదు’’ అని ‘ది న్యూయార్క్ టైమ్స్’ తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ‘‘డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ రేసు నుంచి బైడెన్ను తప్పించడం అత్యంత దేశభక్తితో కూడిన ఐచ్ఛికం’’ అని ‘ది అట్లాంటిక్’ పేర్కొంది. బైడెన్ మాత్రం.. తాను పోటీలో కొనసాగనున్నట్లు తాజాగా న్యూజెర్సీలో తన మద్దతుదారులతో మాట్లాడుతూ పునరుద్ఘాటించారు. మరోవైపు- ట్రంప్తో సంవాదం అనంతరం స్వతంత్ర ఓటర్లలో 10% మంది బైడెన్ వైపు మొగ్గుచూపారని ఓ సర్వేలో తేలినట్లు అధ్యక్షుడి బృందం పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు షికాగోలో ఆగస్టు 19-22 మధ్య భేటీ కానున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే 1,975 మంది డెలిగేట్ల మద్దతు అవసరం కాగా.. బైడెన్కు 3,894 మంది మద్దతు ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17.42 గంటల్లో ఇంగ్లిష్ ఛానల్ ఈదిన భారత మాతృమూర్తి
ఇంగ్లిష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన తన్వీ చవాన్ దేవరె (33) రికార్డు సృష్టించారు. -
స్పెయిన్ విమానంలో కుదుపులు.. ఆగమాగమైన ప్రయాణికులు
గగనతలంలో వెళుతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి అమాంతం ఎగిరిపడ్డారు. -
నేపాల్లో కూలనున్న ప్రచండ సర్కారు
నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. -
సంక్షిప్త వార్తలు
నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా. -
ఖాన్ యూనిస్లో విధ్వంసం
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపు దాడికి దిగాయి. -
ఉక్రెయిన్కు మరో 230 కోట్ల డాలర్ల భద్రతా సాయం: అమెరికా
ఉక్రెయిన్కు త్వరలో 230 కోట్ల డాలర్ల అదనపు భద్రతా సాయాన్ని చేయనున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. దీనికింద ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, -
మోదీ, పుతిన్లు ఏదైనా చర్చించొచ్చు: క్రెమ్లిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్కు, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా విశ్వసనీయమైన మైత్రి ఉందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. -
‘పశ్చాత్తాప పడే పని చేయవద్దు’ - ఓటర్లకు రిషి సునాక్ పిలుపు
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాన మంత్రి రిషి సునాక్.. పశ్చాత్తప పడే పని చేయవద్దని ఓటర్లకు సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి