- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
UK Elections: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు.
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో (UK Parliament Elections) లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీని గద్దెదించి.. 14 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకుంది. అయితే, ఈ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు భారత సంతతి అభ్యర్థులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా తెలుగు వ్యక్తులిద్దరూ ఓటమిపాలవడం గమనార్హం.
అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరొందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ (Labour Party) తరఫున నార్త్ బెడ్ఫోర్డ్షైర్ స్థానం పోటీ చేశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆయన ఓడిపోయారు. ఈ స్థానంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిచర్డ్ ఫుల్లర్ 19,981 ఓట్లతో విజయం సాధించగా.. నాగరాజు 14,567 ఓట్లతో రెండు స్థానానికి పరిమితమయ్యారు. ఈయన స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం. యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఈయన బంధువు.
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
తెలుగు సంతతి చెందిన మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి (Chandra Kanneganti) కూడా ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్ర 6,221 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ లేబర్ పార్టీకి చెందిన గారెత్ స్నెల్ విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తయిన తర్వాత లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. స్టోక్ ఆన్ ట్రెంట్ నగరంలో రెండుసార్లు కౌన్సిలర్గా, ఒకసారి మేయర్గానూ పని చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
Adult Content: అశ్లీల చిత్రాలు చూసేవారిలో మైనర్ల సంఖ్య పెరుగుతున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు ఓ మొబైల్ యాప్తో పరిష్కారాన్ని సిద్ధం చేసింది. అదేంటి? ఎలా పనిచేస్తుందో చూద్దాం..! -
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
ఓ రకమైన చెక్కను తిని జీవించే పురుగు ఖరీదు ఏకంగా రూ.75 లక్షలు. దానికి అంత ధర ఎందుకో తెలుసా..? -
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
Biden: అధ్యక్ష పోటీ నుంచి బైడెన్ వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో హవాయి గవర్నర్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. -
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
-
హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత