- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
US shootings: అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి.. దుండగుడి ఆత్మహత్య!
US shootings: లాస్ వెగాస్లో తుపాకీతో ఐదుగురు సామాన్యులను పొట్టనబెట్టుకున్న దుండగుడు.. చివరకు తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
US shootings | లాస్ వేగాస్: అమెరికాలోని లాస్ వెగాస్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్లలో ఐదుగురిని కాల్చి చంపి, 13 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు మంగళవారం వెల్లడించారు. నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎదురుపడటంతో నిందితుడు ఎరిక్ ఆడమ్స్ (57) మంగళవారం ఉదయం తనని కాల్చుకున్నట్లు తెలిపారు. వేర్వేరు అపార్ట్మెంట్లలో సోమవారం రాత్రి కాల్పులు జరిపినప్పటి నుంచి అధికారులు అతడి కోసం గాలిస్తున్నారు.
నార్త్ లాస్ వెగాస్లోని ఒక అపార్ట్మెంట్లో సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు మహిళలు చనిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు మరింత లోపలికి వెళ్లగా.. 13 ఏళ్ల బాలిక తీవ్రమైన తుపాకీ గాయాలతో ఉండడం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మరో అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడి మృతదేహాలను గుర్తించారు. దుండగుడి కాల్పుల్లో మొత్తం ఐదుగురు చనిపోయారని పోలీసులు నిర్ధరించారు.
దీంతో ప్రమాదకారి అయిన ఓ సాయుధుడు సమీపంలో ఉన్నాడంటూ స్థానికులను పోలీసులు అప్రమత్తం చేశారు. అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక దుకాణం దగ్గరల్లో నిందితుడు కనిపించాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకోగా దుండగుడు తుపాకీతో సమీపంలోని ఇంటి పెరట్లోకి పరిగెత్తాడు. తుపాకీ విడిచిపెట్టి లొంగిపోవాలని కోరినప్పటికీ అతడు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
India-China: విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈసందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. -
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
ట్రంప్ (Trump)తో జరిగిన సంవాదంలో బైడెన్ (Biden) తడబాటుకు గురయ్యారు. దీని గురించి ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో అధ్యక్షుడు స్పందించారు. -
నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు. -
అణుసామర్థ్య స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తాం
అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికాను హెచ్చరించారు. -
స్మార్ట్ఫోన్ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకం
పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్ఫోన్ వంటి డిజిటల్ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు. -
ఐఎస్ఎస్లో కొద్దిసేపు ఎమర్జెన్సీ
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. -
చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు
చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది. -
అమెరికాలో కొవిడ్ కేసులు
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొవిడ్-19 కేసులు వెలుగుచూస్తుండడంతో ఇక్కడి సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
అమెరికా హెల్త్ కేర్ కుంభకోణంలో హైదరాబాద్ వైద్యుడు
అమెరికాలో చోటుచేసుకున్న భారీ ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) కుంభకోణానికి సంబంధించి ఓ భారతీయుడు, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా 193 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. -
500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం
వాతావరణ మార్పుల వల్ల జూన్లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
నౌకలపై దాడులు ఆపండి
పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలిపివేయాలని హూతీ తిరుగుబాటుదారులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ఓ తీర్మానం ఆమోదించింది. -
బైడెన్, ట్రంప్ వాడీవే‘ఢీ’
ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల చర్చ ఊహించినట్లే వాడీవేడిగా జరిగింది. -
ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్
రిఫార్మ్ పార్టీకి చెందిన ఓ నేత తనపై చేసిన జాత్యాహంకార దూషణలు ఎంతో బాధించాయని, ఆగ్రహం కూడా తెప్పించాయని రిషి సునాక్ పేర్కొన్నారు. -
‘పక్షపాత వైఖరి.. ఓటు బ్యాంకు కోణం’.. అమెరికా నివేదికను ఖండించిన భారత్
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
-
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్
-
అనంత్ అంబానీ-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సామూహిక వివాహాలు
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
-
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ
-
పోర్టింగ్కు కొత్త రూల్.. సిమ్ మార్చాక 7 రోజులు ఆగాల్సిందే..!