- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. సురక్షిత స్థానాలకు వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీనికి అత్యంత సమీపంలోనే ఓ పాత మృత ఉపగ్రహం శకలాలుగా మారిపోయింది. ఇవి ఐఎస్ఎస్ (ISS) కు ముప్పు కావచ్చని తొలుత ఆందోళన చెందారు.
ఇంటర్నెట్డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్ఎస్కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
బుధవారం ఐఎస్ఎస్కు దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు నాసా గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు చేరవేసింది. దీంతో నిర్దేశిత ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన స్పేస్క్రాఫ్ట్ల్లోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 5 నుంచి అక్కడ ఉన్న విలియమ్స్, విల్మోర్లు స్టార్లైనర్ క్యాప్సుల్లో తల దాచుకొన్నారు.
దాదాపు గంటసేపు మిషిన్ కంట్రోల్స్ ఇక్కడి వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశితంగా పరిశీలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పులేదని నిర్ధారించుకొని వ్యోమగాములకు క్లియరెన్స్ ఇచ్చారు.
రష్యాకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం రిస్యూర్స్-1 రెండేళ్ల క్రితం నిరుపయోగంగా మారింది. ఇది బుధవారం దాదాపు 100 ముక్కలుగా విడిపోయింది. ఈ పరిణామాలు మొత్తం ఐఎస్ఎస్కు అత్యంత సమీపంలోనే చోటు చేసుకొన్నాయి. కొన్ని గంటల పాటు దీనినుంచి శకలాలు వెలువడ్డాయని లియోల్యాబ్స్ అనే స్పేస్ ట్రాకింగ్ సంస్థ పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన రాస్కాస్మోస్ ఏజెన్సీ నుంచి ఎటువంటి వివరణ వెలువడలేదు. ఇప్పటికే అంతరిక్షంలో వేల సంఖ్యలో ఉపగ్రహ శకలాలు సంచరిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం పనిచేస్తున్న శాటిలైట్లకు ప్రమాదకరంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
తమకు మరిన్ని దీర్ఘశ్రేణి ఆయుధాలు అందజేయాలని, గగనతల రక్షణ వ్యవస్థలు సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. పశ్చిమ దేశాలను కోరారు. -
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల వేళ.. అక్కడి హిందూ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. -
చనిపోయాక ‘గేట్స్’కు విరాళాలు ఉండవు - వారెన్ బఫెట్
తాను చనిపోయిన తర్వాత బిల్గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఉండవని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ పేర్కొన్నారు. -
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
Nigeria: నైజీరియాలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. -
మరో యుద్ధ భయం?
పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనుందా.. ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగనున్నాయా? ఈ రెండింటి మధ్య నానాటికీ విస్తరిస్తున్న సాయుధ ఘర్షణలు మరో యుద్ధం తప్పదన్న విస్పష్ట సంకేతాల్ని వెలువరిస్తున్నాయి. -
ఉక్రెయిన్పై రష్యా దాడిలో 12 మంది మృతి
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో శనివారం రష్యా జరిపిన దాడుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. డునిప్రొ డగ్ నగరంలోని అపార్ట్మెంటుపై శుక్రవారం జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. -
అవును...తడబడ్డాను
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండగా.. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. -
సుస్థిరాభివృద్ధి ఉప లక్ష్యాల సాధనలో ప్రపంచం వెనుకంజ
ప్రపంచంలో 700 కోట్లమంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 169 ఉప లక్ష్యాలలో కేవలం 17 శాతాన్ని మాత్రమే 2030 గడువుకల్లా సాధించగలుగుతామని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికలో పేర్కొంది. -
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన
తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్ (రన్ఆఫ్ పోలింగ్)ను నిర్వహించబోతున్నారు. -
ఐక్యూ తక్కువైతే పక్షవాతం!
బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు యాభై ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారిన పడే ప్రమాదం ఎక్కువని ఇజ్రాయెల్లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధన హెచ్చరిస్తోంది. -
సెర్బియాలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద దాడి
సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీవద్ద విల్లులాంటి ఆయుధంతో వచ్చిన దుండగుడు భద్రతాధికారిపై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే తేరుకున్న అధికారి కాల్పులు జరిపి నిందితుడిని హతమార్చారు. -
ఉక్రెయిన్పైకి ఉత్తరకొరియా ఆయుధాలు!
ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తరకొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తోందని ఓ పరిశోధన సంస్థ అధిపతి శుక్రవారం ఐరాస భద్రతా మండలికి తెలియజేశారు. -
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు రూ.7వేల కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జాగిలాల సాయంతో పబ్బుల్లో పోలీసుల తనిఖీలు
-
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
-
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం