- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
UK Elections: బాధ్యత వహించినా.. సునాక్ కేవలం బాధితుడేనా!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ.. అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో 14ఏళ్ల కన్జర్వేటివ్ల పాలనకు తెరపడింది. కష్టకాలంలో పాలనా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్.. ఓటమిని అంగీకరిస్తూ, ఇదో ‘కష్టమైన రాత్రి’ అని పేర్కొన్నారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి గల పలు కారణాలను పరిశీలిస్తే..
- అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీపై ఓటర్లలో నెలకొన్న నిరాసక్తత. బ్రిటన్లో ఏ రాజకీయ పార్టీ కూడా వరుసగా ఐదోసారి విజయం సాధించలేదు. అక్కడ రెండు ప్రధాన పార్టీల మధ్య 10 నుంచి 15ఏళ్లకు ఓసారి పరస్పర అధికార మార్పిడి జరిగే తీరు కనిపిస్తోంది.
- టోరీలు (కన్జర్వేటివ్) 1979 నుంచి 1997 వరకు అధికారంలో ఉండగా, లేబర్ పార్టీ 1997 నుంచి 2010 వరకు ఉంది. ఆ తర్వాత మళ్లీ టోరీలు అధికారం చేపట్టారు. ఇలా రెండు పార్టీల మధ్య అధికార బదలాయింపునకు ఓటర్లు జై కొడుతున్నారు.
- టోరీలు తీసుకున్న పలు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ మందగించిందనే వాదన ఉంది. పన్నుల వ్యవహారం, రికార్డు స్థాయిలో వలసలు వంటి అంశాలు తాజా రాజకీయాల్లో నిగెల్ ఫరేజ్ వంటి నాయకుడిని తెరమీదకు తేవడానికి కారణమైనట్లు చెబుతుంటారు.
- నిగెల్ సారథ్యంలో రిఫార్మ్ యూకే వంటి కొత్త పార్టీ పుట్టుకు రావడమే కాకుండా తాజా ఎన్నికల్లో దాదాపు 15శాతం ఓట్లు పొందడం గమనార్హం. నిగేల్ తొలిసారి విజయం సాధించడంతో పాటు నాలుగు స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. ఇవన్నీ కన్జర్వేటివ్కు గండికొట్టినవేనని తెలుస్తోంది. ఇది ఇబ్బందికర పరిణామమేననే కలవరం టోరీల్లో నెలకొనడంతోపాటు ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి మరింత క్షీణించవచ్చనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైంది.
కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలు..
- ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న పొదుపు చర్యలు, బ్రెగ్జిట్తో మందగించిన ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయం భారీగా పెరిగిపోవడం, వరుస కుంభకోణాలు వంటివి కన్జర్వేటివ్ పార్టీపై ఓటర్లలో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి.
- ముఖ్యంగా కొవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ పార్టీలు చేసుకున్న వ్యవహారం వెలుగు చూడటం, ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్ నిర్ణయాలతో మార్కెట్ కుదేలవడం వంటివి పార్టీ స్థాయిని మరింత దిగజార్చాయి.
- ఎన్నికల ప్రచారం సమయంలోనే పార్టీ సహచరుల బెట్టింగ్ కుంభకోణం వెలుగు చూడటం కూడా సునాక్ ప్రభుత్వంపై విమర్శలకు కారణమైంది.
- ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సునాక్ తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపడినప్పటికీ.. బోరిస్, లిజ్ ట్రస్ల తీరుతోనే పార్టీ పతనమైందని సొంత పార్టీ నేతలే వాదిస్తున్నారు. ఇందులో సునాక్ పాత్ర ఏమీ లేదని, కేవలం ఆయన బాధితుడు మాత్రమేనని చెబుతున్నారు.
- ఈ నష్టాల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు రిషి సునాక్ ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రజలతో మమేకమయ్యేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ సంపన్నుడికి సాధారణ పౌరుల ఇబ్బందులు ఎలా తెలుస్తాయనే విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు.
- జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో పాటు సమర్థ, నైతిక పాలన అందిస్తామనే హామీలతో కియర్ స్టార్మర్ సారథ్యంలోని లేబర్ పార్టీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం తాజా ఎన్నికల్లో ఘన విజయానికి దోహదం చేసినట్లు అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలంటూ ఇజ్రాయెల్లో నిరసనకారులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా హైవేలను దిగ్బంధించారు. -
ఉక్రెయిన్ ప్రతిదాడులు.. రష్యాలో పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
ఉక్రెయిన్ చేస్తోన్న ప్రతిదాడులతో రష్యాలోని వొరోనెజ్ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి (State of Emergency) విధించారు. -
మైనర్ల చేతిలో అశ్లీల కంటెంట్.. అడ్డుకట్టకు స్పెయిన్ వినూత్న ఆలోచన!
Adult Content: అశ్లీల చిత్రాలు చూసేవారిలో మైనర్ల సంఖ్య పెరుగుతున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు ఓ మొబైల్ యాప్తో పరిష్కారాన్ని సిద్ధం చేసింది. అదేంటి? ఎలా పనిచేస్తుందో చూద్దాం..! -
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
ఓ రకమైన చెక్కను తిని జీవించే పురుగు ఖరీదు ఏకంగా రూ.75 లక్షలు. దానికి అంత ధర ఎందుకో తెలుసా..? -
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
Biden: అధ్యక్ష పోటీ నుంచి బైడెన్ వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో హవాయి గవర్నర్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. -
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధానికి తొమ్మిది నెలలు.. నెతన్యాహుకు నిరసన సెగలు!
-
సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235
-
నా పరిస్థితే వేరు.. దేశవాళీలో ఆడమనడం సమంజసంగా అనిపించలేదు: ఇషాన్
-
మద్యం సేవించి.. దంపతులను కారుతో ఢీ కొట్టి!
-
ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా
-
జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకొని!