- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Donald Trump: తొలి డిబేట్లో దూకుడు.. ‘ట్రంప్ మీడియా’ షేర్లు పైపైకి!
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో ఉన్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య జరిగిన తొలి డిబేట్ అనంతరం..‘ట్రూత్ సోషల్’ షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో ఉన్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య తొలి డిబేట్ వాడీవేడీగా సాగింది. ఇందులో దూకుడుగా వ్యవహరించిన మాజీ అధ్యక్షుడు ట్రంపే పైచేయి సాధించినట్లు సర్వేలు పేర్కొన్నాయి. దీంతో ఆయనకు చెందిన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ షేర్లు ఒక్కసారిగా ఐదు శాతం పెరిగిపోయాయి. ఒకవేళ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ వేదికే ఆయనకు అతిపెద్ద గొంతుక అవుతుందని పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
చర్చ అనంతరం మీడియాలో వచ్చిన ఫలితాల ఆధారంగా ట్రంప్ మీడియా సంస్థపై ఆసక్తి పెరిగినట్లు కనిపిస్తోందని సిటీ గ్రూపునకు చెందిన విశ్లేషకులు పేర్కొన్నారు. ‘హష్మనీ’ కేసు విచారణ సమయంలో ఆ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. గత త్రైమాసికంలో దాదాపు 300 మిలియన్ డాలర్లకుపైగా నష్టపోయినట్లు మే నెల నివేదికలో సంస్థ పేర్కొంది. తాజా చర్చ పూర్తయిన తర్వాత మొదలైన ట్రేడింగ్లో ఒకేసారి ఐదుశాతం పెరగడం గమనార్హం.
ట్రంప్ దూకుడు.. బైడెన్ తడబాటు.. ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ
2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారిగా ముఖాముఖి తలపడిన ఇద్దరునేతలు.. అబార్షన్లు, వలసవాదం, 2020 క్యాపిటల్ దాడులు, సామాజిక భద్రత, ట్రంప్పై కేసులు, నాటో వంటి అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయి వ్యక్తిగత విమర్శలకూ దిగారు. మొత్తంగా ఇందులో మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించగా.. బైడెన్ కొన్నిచోట్ల తడబడ్డట్లు కనిపించారు. అట్లాంటాలోని సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయం ఈ డిబేట్కు వేదికైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు. -
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
తమకు మరిన్ని దీర్ఘశ్రేణి ఆయుధాలు అందజేయాలని, గగనతల రక్షణ వ్యవస్థలు సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. పశ్చిమ దేశాలను కోరారు. -
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల వేళ.. అక్కడి హిందూ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. -
చనిపోయాక ‘గేట్స్’కు విరాళాలు ఉండవు - వారెన్ బఫెట్
తాను చనిపోయిన తర్వాత బిల్గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఉండవని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ పేర్కొన్నారు. -
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
Nigeria: నైజీరియాలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. -
మరో యుద్ధ భయం?
పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనుందా.. ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగనున్నాయా? ఈ రెండింటి మధ్య నానాటికీ విస్తరిస్తున్న సాయుధ ఘర్షణలు మరో యుద్ధం తప్పదన్న విస్పష్ట సంకేతాల్ని వెలువరిస్తున్నాయి. -
ఉక్రెయిన్పై రష్యా దాడిలో 12 మంది మృతి
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో శనివారం రష్యా జరిపిన దాడుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. డునిప్రొ డగ్ నగరంలోని అపార్ట్మెంటుపై శుక్రవారం జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. -
అవును...తడబడ్డాను
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండగా.. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. -
సుస్థిరాభివృద్ధి ఉప లక్ష్యాల సాధనలో ప్రపంచం వెనుకంజ
ప్రపంచంలో 700 కోట్లమంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 169 ఉప లక్ష్యాలలో కేవలం 17 శాతాన్ని మాత్రమే 2030 గడువుకల్లా సాధించగలుగుతామని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికలో పేర్కొంది. -
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన
తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్ (రన్ఆఫ్ పోలింగ్)ను నిర్వహించబోతున్నారు. -
ఐక్యూ తక్కువైతే పక్షవాతం!
బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు యాభై ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారిన పడే ప్రమాదం ఎక్కువని ఇజ్రాయెల్లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధన హెచ్చరిస్తోంది. -
సెర్బియాలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద దాడి
సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీవద్ద విల్లులాంటి ఆయుధంతో వచ్చిన దుండగుడు భద్రతాధికారిపై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే తేరుకున్న అధికారి కాల్పులు జరిపి నిందితుడిని హతమార్చారు. -
ఉక్రెయిన్పైకి ఉత్తరకొరియా ఆయుధాలు!
ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తరకొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తోందని ఓ పరిశోధన సంస్థ అధిపతి శుక్రవారం ఐరాస భద్రతా మండలికి తెలియజేశారు. -
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు రూ.7వేల కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
-
పిఠాపురంలో పవన్ పర్యటన.. అభిమానుల భారీ ఏర్పాట్లు
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
మోదీ బర్త్డే వేళ ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం
-
అర్జునుడిగా నేను.. ప్రభాస్ కర్ణుడు.. అలాగే చూడండి: విజయ్ దేవరకొండ
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్