- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
LAC: ‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్ స్పష్టం
సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వాస్తవాధీన రేఖ (LAC)ను గౌరవించడంతోపాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగశాఖ చైనాకు స్పష్టంచేసింది. వీటితోపాటు సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. కజఖిస్థాన్లోని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) భేటీ అయ్యారు. భారత్-చైనా సరిహద్దులో, ముఖ్యంగా లద్ధాఖ్తోపాటు వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న వివాదాల పరిష్కార మార్గాలపై ఇరువురు నేతల బృందం చర్చించింది.
‘‘ఎల్ఏసీని గౌరవించడం, సరిహద్దులో శాంతిని నెలకొల్పడం ఎంతో అవసరం. పరస్పర గౌరవం, పరస్పర మనోభావాలు, పరస్పర ప్రయోజనాలు అనే మూడు అంశాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నిర్దేశిస్తాయి’ అని విదేశాంగ మంత్రి జై శంకర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వీటితోపాటు సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలపైనా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని చైనాకు నొక్కిచెప్పారు. సైనిక, దౌత్య మార్గాల్లో ఈ ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించినట్లు సమాచారం.
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను - జో బైడెన్
తూర్పు లద్ధాఖ్లో సరిహద్దు వివాదం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2020లో గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యం మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరగడం.. అప్పటినుంచి ఆ ప్రాంతంలో ఇరుదేశాలు భారీ సంఖ్యలో సైన్యాలను మోహరించాయి. అనంతరం అనేక దఫాల్లో సైనికాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. దాంతో కొన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాల్లో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇలా ఉద్రిక్త పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగడం రెండు దేశాలకు మంచిది కాదని ఎస్.జైశంకర్ పలుమార్లు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్లూ లైన్లో యుద్ధ మేఘాలు.. ఐరాస తీవ్ర ఆందోళన
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్పై ఇంటికి..
Netherlands: 14 ఏళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన నేత పదవి నుంచి దిగిపోతూ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. -
దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తాను వైదొలిగేదే లేదని జో బైడెన్ పునరుద్ఘాటించారు. ట్రంప్తో డిబేట్ సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. -
బ్రిటన్ నూతన ప్రధానికి మోదీ ఫోన్.. ‘ఎఫ్టీఏ’పై ఏమన్నారంటే..!
బ్రిటన్ నూతన ప్రధానిగా నియమితులైన కీర్ స్టార్మర్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ త్వరగా కొలిక్కి తెచ్చే దిశగా కృషి చేసేందుకు ఇరునేతలు అంగీకరించారు. -
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
ఇరాన్కు మసౌద్ పెజెష్కియాన్ కొత్త అధ్యక్షుడిగా రాబోతున్నారు. ఆయనకు సంస్కరణవాదిగా పేరుంది. -
బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. -
విలయంలోనూ వీడని పుష్ప విలాసం!
ముగింపు కానరాని యుద్ధంలో... అంతులేని ఆవేదనలో... ఇళ్లు కూలుతున్నా.... తోటివారు రాలుతున్నా... తమ వంతెప్పుడో తెలియకున్నా... నష్టాలు... కష్టాలు గుట్టలుగా పేరుకుంటున్నా... మరిగిన జీవితాల్లో కన్నీరు ఇగిరిపోయినా... -
బ్రిటన్ నూతన ఆశాకిరణం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ (61) పేరు ఇంటా బయట మారుమోగిపోతోంది. -
టోరీల నిర్ణయాలే కొంపముంచాయా?
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం వెలగబెట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎంతమంది మారినా నేనిక్కడే!
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్ స్ట్రీట్ (10)లో అడుగుపెట్టిన కీర్ స్టార్మర్కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది. అదే ల్యారీ అనే పిల్లి. -
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. -
మీ ఆగ్రహం నన్ను తాకింది
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన సునాక్ పదవి నుంచి దిగిపోయారు. -
బ్రిటన్ ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి ఓటమి
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ) కూడా బరిలో నిలిచింది. ‘ఏఐ స్టీవ్’ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది. -
వెస్ట్బ్యాంకులో ఏడుగురి మృతి
వెస్ట్బ్యాంకులోని జెనిన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్లో ఏడుగురు మృతి చెందారని పాలస్తీనా అథారిటీ వర్గాలు తెలిపాయి. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది.