- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi: రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8, 9, 10వ తేదీల్లో రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్నారు.
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8-10వ తేదీల్లో ఆయన రష్యా (Russia)తోపాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నట్లు భారత విదేశాంగశాఖ (MEA) ప్రకటించింది. గత అయిదేళ్లలో ప్రధాని మోదీకి రష్యా పర్యటన ఇది తొలిసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను సందర్శించనుండటం ఇదే మొదటిసారి. అదేవిధంగా.. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే ప్రథమం.
‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 8, 9వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. 22వ భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను నేతలిద్దరూ సమీక్షిస్తారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం ఆస్ట్రియాను సందర్శించనున్నారు. స్థానిక నేతలతో సమావేశమవుతారు. అక్కడి వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాస్కో, వియన్నాల్లోని ప్రవాస భారతీయులతోనూ సంభాషిస్తారు’’ అని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్ స్పష్టం
ప్రధాని మోదీ ఇంతకు మునుపు 2019లో రష్యాలో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇప్పటివరకు రష్యా, భారత్ల నడుమ 21 సార్లు వార్షిక భేటీలు జరిగాయి. చివరిసారిగా 2021 డిసెంబరులో దిల్లీ వేదికగా పుతిన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. మూడేళ్ల విరామం అనంతరం 22వ వార్షిక సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించే విషయాన్ని కూడా పుతిన్తో మోదీ చర్చించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తాను వైదొలిగేదే లేదని జో బైడెన్ పునరుద్ఘాటించారు. ట్రంప్తో డిబేట్ సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. -
బ్రిటన్ నూతన ప్రధానికి మోదీ ఫోన్.. ‘ఎఫ్టీఏ’పై ఏమన్నారంటే..!
బ్రిటన్ నూతన ప్రధానిగా నియమితులైన కీర్ స్టార్మర్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ త్వరగా కొలిక్కి తెచ్చే దిశగా కృషి చేసేందుకు ఇరునేతలు అంగీకరించారు. -
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
ఇరాన్కు మసౌద్ పెజెష్కియాన్ కొత్త అధ్యక్షుడిగా రాబోతున్నారు. ఆయనకు సంస్కరణవాదిగా పేరుంది. -
బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. -
విలయంలోనూ వీడని పుష్ప విలాసం!
ముగింపు కానరాని యుద్ధంలో... అంతులేని ఆవేదనలో... ఇళ్లు కూలుతున్నా.... తోటివారు రాలుతున్నా... తమ వంతెప్పుడో తెలియకున్నా... నష్టాలు... కష్టాలు గుట్టలుగా పేరుకుంటున్నా... మరిగిన జీవితాల్లో కన్నీరు ఇగిరిపోయినా... -
బ్రిటన్ నూతన ఆశాకిరణం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ (61) పేరు ఇంటా బయట మారుమోగిపోతోంది. -
టోరీల నిర్ణయాలే కొంపముంచాయా?
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం వెలగబెట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎంతమంది మారినా నేనిక్కడే!
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్ స్ట్రీట్ (10)లో అడుగుపెట్టిన కీర్ స్టార్మర్కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది. అదే ల్యారీ అనే పిల్లి. -
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. -
మీ ఆగ్రహం నన్ను తాకింది
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన సునాక్ పదవి నుంచి దిగిపోయారు. -
బ్రిటన్ ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి ఓటమి
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ) కూడా బరిలో నిలిచింది. ‘ఏఐ స్టీవ్’ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది. -
వెస్ట్బ్యాంకులో ఏడుగురి మృతి
వెస్ట్బ్యాంకులోని జెనిన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్లో ఏడుగురు మృతి చెందారని పాలస్తీనా అథారిటీ వర్గాలు తెలిపాయి. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. విభజన అంశాలపై చర్చ
-
దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
-
బ్రిటన్ నూతన ప్రధానికి మోదీ ఫోన్.. ‘ఎఫ్టీఏ’పై ఏమన్నారంటే..!
-
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును కలిసిన భారాస ఎమ్మెల్యేలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM