- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Myanmar: ఉద్యోగులకు జీతాలు పెంచారని.. యజమానులకు జైలు
Myanmar: తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచారని కొందరు దుకాణదారులకు జైలు శిక్ష విధించారు. ఈ వింత ఘటన మయన్మార్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?
ఇంటర్నెట్ డెస్క్: సైన్యం పాలనలో మయన్మార్ (Myanmar) ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న (Wage Hike) కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కనీసం 10 మంది దుకాణదారులకు ఇదే కారణంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, వారి వ్యాపారాలను బలవంతంగా మూసివేయించింది. మయన్మార్లో వేతనాల పెంపు చట్ట విరుద్ధమేమీ కాదు. కానీ, ద్రవ్యోల్బణ ఆందోళనల వేళ ఇలా జీతాలు పెంచడం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం (Military Government) భావిస్తోందట. ఇదే విషయాన్ని ఆయా దుకాణాల ముందు అంటించిన నోటీసుల్లో పేర్కొంది. వీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించింది.
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
ప్రజస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021లో సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశంలో మిలటరీ పాలనలో ఉండగా.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు పెరగడం ఇతరత్రా సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి సైన్యంపై తిరుగుబాట్లు చేస్తున్నాయి. దీంతో దేశంలో అస్థిరత నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
విమానాశ్రయంలో గ్యాస్ లీక్ అవ్వడంతో పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీనిపై ఆయన స్పందించారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం
UK elections: యూకేలో గురువారం రాత్రి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. -
సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ!
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. -
బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం
జపాన్లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. -
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన.. -
దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. -
వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. -
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. -
షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉక్రెయిన్కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. -
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. -
ఏ పనీ చిన్నది కాదు.. నిబద్ధతతో చేయడమే ముఖ్యం
మనం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి. -
పారిస్లోని ‘గాలరీలఫాయెట్’లో యూపీఐ సేవలు
పారిస్లోని ప్రముఖ షాపింగ్మాల్.. ‘గాలరీ లఫాయెట్’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
-
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ