- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Joe Biden: అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
ట్రంప్ (Trump)తో జరిగిన సంవాదంలో బైడెన్ (Biden) తడబాటుకు గురయ్యారు. దీని గురించి ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో అధ్యక్షుడు స్పందించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండగా.. అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురైన తీరు స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో తన వయసును ఉద్దేశించి బైడెన్ స్పందించారు. ‘‘అవును నేను యువకుడిని కాదని నాకు తెలుసు. గతంలో మాదిరిగా చలాకీగా నడవలేను. అప్పటిలా స్పష్టంగా మాట్లాడలేను. మునుపటి మాదిరిగా చర్చించలేకపోవచ్చు. కానీ నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. నా పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసు. ఎవరైనా కిందపడిపోయినప్పుడు.. తిరిగి మళ్లీ పైకి లేస్తారు. అధ్యక్ష పదవిని నేను నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే మళ్లీ పోటీలో ఉన్నా’’ అని తన డిబేట్పై వస్తోన్న విమర్శలకు అధ్యక్షుడు ఇలా బదులిచ్చారు.
నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే
మరోవైపు మాజీ అధ్యక్షుడు, స్వపక్ష నేత బరాక్ ఒబామా ఆయనకు అండగా నిలిచారు. ‘‘చర్చలు సరిగా జరగని రోజులు ఉంటాయి. అయితే నన్ను నమ్మండి. సాధారణ ప్రజల కోసం జీవితమంతా పోరాడిన వ్యక్తికి (బైడెన్), తన గురించి మాత్రమే పట్టించుకునే వ్యక్తి (ట్రంప్ను ఉద్దేశిస్తూ)కి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరు నిజం చెప్పే వ్యక్తి- మరొకరు సొంత ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తి.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి. ఒక్క డిబేట్ దానిని నిర్ణయించలేదు’’ అని మద్దతుగా నిలిచారు.
చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు సీఎన్ఎన్ పోల్లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ, చివరకు హుందాగా, దీటుగా ముగించారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకుపైగా సమయం ఉన్నందున బైడెన్ను కాకుండా వేరే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలపైనా డెమోక్రాట్లు చర్చించుకుంటున్నారు. అయితే తాను పోటీలో కొనసాగనున్నట్లు ట్రంప్తో సంవాదం అనంతరం బైడెన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైడెన్ వైదొలగాల్సిందే
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. -
పుడమికి చేరువగా వచ్చి వెళ్లిన గ్రహశకలాలు
రెండు గ్రహశకలాలు భూమికి అతిదగ్గరగా వచ్చి వెళ్లాయి. వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. -
ఫ్రాన్స్లో పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి
ఫ్రాన్స్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్ పోలింగ్ పూర్తయింది. -
భీకర హరికేన్ ముప్పు అంచున ఆగ్నేయ కరేబియా ప్రాంతం
ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం భీకర హరికేన్ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ దాని అనుకుని ఉన్న హరికేన్ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. -
బొమ్మ తుపాకీతో పోలీసులకు బెదిరింపు
పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఏడుగురి మృతి
దక్షిణ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు. -
నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు
నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. -
హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. -
సూడాన్లో సైన్యంతో సాయుధ ఘర్షణ
సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. -
బైడెన్ స్థానంలో మరొకరు?- రిపబ్లికన్లకు నిక్కీ హేలీ అలర్ట్
జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
-
పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా
-
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం