- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్ల తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు నోబెల్..
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన ప్రారంభమైంది. 2023కు గానూ వైద్య శాస్త్రం (medicine)లో నోబెల్ పురస్కారాన్ని సోమవారం ప్రకటించారు.
స్టాక్ హోం: వైద్య శాస్త్రం (medicine)లో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం (Nobel Prize)-2023 వరించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలు.. కొవిడ్ (Covid 19)ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA Vaccine) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్లోని స్టాక్హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది.
హంగేరీకి చెందిన కాటలిన్ కరికో.. అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు.. అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయని వీరు తమ పరిశోధనలో గుర్తించారు. దీనిపై 2005లో వీరు ఓ పేపర్ను కూడా పబ్లిష్ చేశారు. అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందనప్పటికీ.. కొవిడ్ మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరి పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివర్లో రెండు mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించడమేగాక.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగాయి అని నోబెల్ బృందం వెల్లడించింది.
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
నగదు బహుమతి పెరిగింది..
నోబెల్ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లకు పెంచారు. స్వీడిష్ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.
స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
ఇరాన్కు మసౌద్ పెజెష్కియాన్ కొత్త అధ్యక్షుడిగా రాబోతున్నారు. ఆయనకు సంస్కరణవాదిగా పేరుంది. -
బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. -
విలయంలోనూ వీడని పుష్ప విలాసం!
ముగింపు కానరాని యుద్ధంలో... అంతులేని ఆవేదనలో... ఇళ్లు కూలుతున్నా.... తోటివారు రాలుతున్నా... తమ వంతెప్పుడో తెలియకున్నా... నష్టాలు... కష్టాలు గుట్టలుగా పేరుకుంటున్నా... మరిగిన జీవితాల్లో కన్నీరు ఇగిరిపోయినా... -
బ్రిటన్ నూతన ఆశాకిరణం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ (61) పేరు ఇంటా బయట మారుమోగిపోతోంది. -
టోరీల నిర్ణయాలే కొంపముంచాయా?
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం వెలగబెట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎంతమంది మారినా నేనిక్కడే!
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్ స్ట్రీట్ (10)లో అడుగుపెట్టిన కీర్ స్టార్మర్కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది. అదే ల్యారీ అనే పిల్లి. -
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. -
మీ ఆగ్రహం నన్ను తాకింది
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన సునాక్ పదవి నుంచి దిగిపోయారు. -
బ్రిటన్ ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి ఓటమి
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ) కూడా బరిలో నిలిచింది. ‘ఏఐ స్టీవ్’ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది. -
వెస్ట్బ్యాంకులో ఏడుగురి మృతి
వెస్ట్బ్యాంకులోని జెనిన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్లో ఏడుగురు మృతి చెందారని పాలస్తీనా అథారిటీ వర్గాలు తెలిపాయి. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇకపై హాస్పిటల్కు వెళ్లం: ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి సిన్హా
-
రెండు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
-
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా..
-
‘ఎట్టకేలకు 400 సీట్లు.. కానీ’: భాజపాపై థరూర్ సెటైర్
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు