- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Birds: పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. ఆస్ట్రేలియాలోని నార్ఫోక్ దీవిలోని పచ్చని చిలుకలు ఇందుకు ఉదాహరణ! ఇవి మిరియాల తీగను నమిలి ఆ పిప్పిని తమ ఈకలపైకి వెదజల్లుకోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.
కొన్ని విహంగాలు పనిగట్టుకొని.. చీమలను సేకరించి, ఈకలపై చల్లుకుంటాయి.
మరికొన్ని పక్షులేమో బాగా పండిపోయిన పండ్లను ఏరికోరి తింటాయి. ఈ క్రమంలో అనారోగ్యం పాలవుతుంటాయి కూడా! అయినా ఆ అలవాటు మానుకోవు.
ఈ వ్యవహారశైలి వెనుక లోగుట్టు చాలాకాలం పాటు శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉంది. ఇందుకు పలు అంశాలు దోహదపడుతున్నా.. ప్రధానంగా ఈ పక్షులు ‘కిక్కు’ కోసమే ఇలా చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ చర్యల ద్వారా అవి ఉల్లాసం.. ఉత్సాహం పొందుతున్నట్లు తేల్చారు.
పారవశ్యం కోసం..
హానికర పరాన్నజీవుల నుంచి రక్షణ పొందడానికే మిరియాల తీగను నమిలి, ఆ పిప్పిని ఈకలపైకి వెదజల్లుకుంటున్నాయని శాస్త్రవేత్తలు భావించారు. మిరియాల తీగలోని పిపరీన్ అనే పదార్థంలో ఔషధ లక్షణాలు ఉన్నాయి.
పక్షులు చీమలను మీద వేసుకోవడాన్ని యాంటింగ్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ రక్షణ కోసం చీమలు.. ఫార్మిక్ యాసిడ్ను విడుదల చేస్తాయి.
ఫార్మిక్ యాసిడ్, పిపరీన్లు ఘాటైన రసాయనాలు. వాటికి ఔషధ గుణాలతోపాటు కీటకాలను దరిచేరకుండా చేసే లక్షణాలు ఉన్నాయి. అవి ఉత్ప్రేరకాలుగానూ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మిరియాల తీగ పిప్పిని శరీరానికి పులుముకునేటప్పుడు చిలుకలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించాయి. అందువల్ల ఆనందం కోసం కూడా అవి ఇలా చేస్తుండొచ్చని భావిస్తున్నారు.
యాంటింగ్ వల్ల ఆమోదయోగ్య ప్రభావం ఉంటుందని 1931లో ఆల్ఫ్రెడ్ ట్రోషచజ్ అనే ప్రకృతి ప్రేమికుడు చెప్పారు. తాను అధ్యయనం చేసిన ఒక పక్షి.. యాంటింగ్ ద్వారా మానసిక ఉద్దీపనలు పొందడాన్ని గుర్తించానని 1957లో అమెరికా శాస్త్రవేత్త లోవీ విటేకర్ పేర్కొన్నారు. ఇందులో శృంగార ఉద్దీపన కూడా ఉండొచ్చన్నారు. ఆమె అభిప్రాయాలను నాడు కొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు.
అయితే యాంటింగ్ వల్ల పక్షుల్లో పారవశ్య స్థితిని ఆ తర్వాత కొందరు పరిశోధకులు గమనించారు. చీమలను మీద వేసుకున్నాక.. ఆస్ట్రేలియా మ్యాగ్పై పక్షులు ఈకలను విప్పార్చడం, శరీరాన్ని ఒకింత మెలితిప్పడం, తడబడినట్లు నడవడం, విచిత్రంగా స్పందించడం వంటి లక్షణాలను ప్రదర్శించడాన్ని వారు చూశారు. చీమల్లోని టాక్సిన్లలో చిత్తభ్రమలు కలిగించే కొన్ని పదార్థాలను గుర్తించారు. అందులో ఫార్మిక్ యాసిడ్ కూడా ఒకటి.
మైకంలో గగనవిహారం
మద్యపానం అలవాటున్నవారు ఆల్కహాల్ కోసం పిచ్చెక్కిపోతుంటారు. పక్షులు కూడా ఆల్కహాల్ కోసం ఇదే రీతిలో వెంపర్లాడటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం అవి.. బాగా పండి, పులిసిన పండ్లు, బెర్రీలను తింటుంటాయి. ఫలితంగా కిక్కు నషాళానికెక్కి.. ఒళ్లు తెలియని స్థితిలోకి జారిపోతుంటాయి. ఆ దశలో అవి కిటికీలు, వాహనాలను ఢీ కొట్టడం, పిల్లులు వంటి జంతువులకు ఆహారంగా దొరికిపోవడం జరుగుతుంటుంది. ఒక్కోసారి ఇది వికటించి ‘ఆల్కహాల్ పాయిజనింగ్’కూ దారితీస్తుంటుంది.
- 2021లో ఇలా ‘తప్పతాగిన’ కొన్ని రెడ్ వింగ్డ్ ప్యారెట్లను పశ్చిమ ఆస్ట్రేలియాలోని బ్రూమ్ వెటర్నరీ ఆసుపత్రికి అప్పగించారు. ఇవి బాగా పండిపోయిన మామిడి పండ్లను ఆరగించినట్లు గుర్తించారు.
- న్యూజిలాండ్లో కెరెరు అనే ఒక రకం పావురానికి ఈ అలవాటు ఉంది. ఈ జాతి పక్షులు తరచూ మత్తులోకి జారిపోతుంటాయి. చెట్ల మీద నుంచి కిందకు పడిపోతుంటాయి.
ఇందుకే..
పండ్లు పండేకొద్దీ తియ్యగా మారిపోతుంటాయి. ఎక్కువ పోషకాలను సంతరించుకుంటాయి. అవి మరింత పండితే వాటిలోని చక్కెర పులిసిపోతుంది. ఫలితంగా అందులో ఆల్కహాల్ గాఢత పెరుగుతుంది.
ఈ పండ్ల కోసం పక్షులు వెంపర్లాడటం వెనుక లోతైన పరిణామక్రమ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్లు పులిసే సమయంలో ఉత్పత్తయ్యే వోలటైల్ పదార్థాలు (ఆల్కహాల్స్).. గాల్లో వ్యాప్తి చెందుతాయి. తద్వారా పోషకాలతో కూడిన ఆహారాన్ని వెతికి పట్టుకోవడంలో పక్షులకు సాయం చేస్తాయి. ఇథనాల్ అనేది ఒకవిధంగా శక్తికి మంచి వనరు. అది ఆకలిని పెంపొందిస్తుంది. ఫలితంగా పక్షికి మేలు జరుగుతుంది. అలాగే.. ఆ పండు విత్తనాల వ్యాప్తికీ ఇది దోహదపడుతుంది.
సాధారణంగా.. ఈ పండ్ల వల్ల పక్షుల్లో కిక్కు స్వల్పంగానే ఉంటుంది. తప్పతాగినట్లు వ్యవహరించే కేసులు చాలా అరుదు.
మానవుల్లోనూ..
ఫార్మిక్ యాసిడ్ను కండరాల శక్తిని పెంచుకోవడానికి, అలసట భావాన్ని తగ్గించుకోవడానికి వాడుతుంటారు. ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని, లైంగిక వాంఛలను మెరుగుపరచుకోవడానికి 17వ శతాబ్దంలో ఐరోపాలో ఉపయోగించిన ఒక టానిక్లోని రహస్య పదార్థం ఇదే అయి ఉంటుందని భావిస్తున్నారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని దేశీయ తెగలవారు.. రెడ్ హార్వెస్టర్ చీమలను వైద్య అవసరాలకు, మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించేవారు. ఈ కీటకాలను వారు సజీవంగా, భారీ పరిమాణంలో తినేవారు. తద్వారా చిత్తభ్రమల్లోకి జారిపోయేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రీంకోర్టులో ట్రంప్నకు ఉపశమనం
అధ్యక్ష ఎన్నికల్లో(2020) ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. -
పోటీలో కొనసాగనున్న బైడెన్!
డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సంవాదంలో పేలవమైన పనితీరు కారణంగా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్.. తాను వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలను సోమవారం ఇచ్చారు. -
తీరం దాటిన ‘బెరిల్’ హరికేన్
కరీబియన్ దీవులను ‘బెరిల్’ హరికేన్ గజగజలాడిస్తోంది. సోమవారం అది మరింత తీవ్ర రూపం దాల్చి.. కరియాకౌ ఐలాండ్లో తీరం దాటింది. -
నాలుగేళ్ల తర్వాత భారత్కు ప్రయాణం.. విమానంలో ప్రాణం విడిచిన యువతి
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు బయలుదేరిన ఆమె హఠాత్తుగా విమానంలోనే ప్రాణాలు విడిచింది. -
ఆస్టియోపొరోసిస్ ముప్పుపై హెచ్చరికలు చేసే ఏఐ
ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది. -
ఫ్రాన్స్లో మెక్రాన్కు ఎదురుదెబ్బ!
ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల తొలి విడత ఓటింగ్లో అతి జాతీయవాద నేషనల్ ర్యాలీ పార్టీ ఆధిక్యం సాధించినట్లు సోమవారం విడుదలైన ఫలితాలు సూచిస్తున్నాయి. -
ఆస్ట్రేలియా చదువులు మరింత భారం
అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థుల వీసా రుసుములను ఆ దేశం భారీగా పెంచేసింది. -
మనవళ్ల సంరక్షణ చూసే అవ్వాతాతలకు సెలవులు!
పిల్లల పెంపకం దిశగా స్వీడన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మనవళ్ల సంరక్షణ కోసం అవ్వాతాతలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే చట్టం తెచ్చింది. -
ఖాన్యూనిస్ను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్
గాజాలోని ఖాన్ యూనిస్ను ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఆదేశించింది. -
ఇజ్రాయెల్ నుంచి 55 మంది పాలస్తీనా బందీల విడుదల
పాలస్తీనాకు చెందిన 55 మంది బందీలను ఇజ్రాయెల్ సోమవారం విడుదల చేసింది. వారిలో గాజాలోని షిఫా ఆసుపత్రి డైరెక్టర్ మహ్మద్ అబు సల్మియా కూడా ఉన్నారు. -
ప్రమాదవశాత్తూ గాల్లోకి చైనా రాకెట్
పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఒక శక్తిమంతమైన రాకెట్ ప్రమాదవశాత్తు గాల్లోకి దూసుకెళ్లింది. -
మనుగడ వ్యూహాలకు కేంద్రస్థానం ఇదే..!
మనుగడ కోసం సందర్భోచితంగా వివిధ వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్ అనే భాగం ఈ అంశంలో కీలకమని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన గుర్తించింది. -
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ గౌను వేసుకున్నా.. వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
కిమ్ (Kim Jong Un) నియంతృత్వ రాజ్యంలో ఆంక్షలు చిత్రంగా ఉంటాయి. ప్రజల అభిరుచులపై సైతం ఆయన కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. -
ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం
గాజాలోని ఖాన్ యూనిస్ నగరం తూర్పు ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి
-
జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు
-
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
-
‘మై క్వీన్’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!