- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఆన్లైన్ గేమ్లో గొడవ.. గేమర్ను హతమార్చేందుకు 750 కి.మీల ప్రయాణం!
ఆన్లైన్ గేమ్లో పాల్గొన్న ఇద్దరు యువకులు ఏదో కారణంపై గొడవపడ్డారు. దీంతో ఓ యువకుడు తోటి గేమర్ను హతమార్చేందుకు 750 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్ గేమ్ (Online Game)కు బానిసగా మారి కొందరు మతిస్థిమితం కోల్పోయారంటూ తరచూ వార్తలు వింటున్నాం. కానీ, ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్లో గొడవ పడిన మరో గేమర్ను హతమార్చేందుకు ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. నేరుగా అతడి నివాసానికి వెళ్లి సుత్తితో యువకుడి తలను పగలగొట్టాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే..
న్యూజెర్సీకి చెందిన ఎడ్వర్డ్ కాంగ్ ఆన్లైన్ గేమింగ్కు బానిసగా మారాడు. గేమ్ ఆడుతున్న క్రమంలో మరో గేమర్తో ఏదో కారణంతో వాగ్వాదానికి దిగాడు. గొడవ కాస్తా ముదరడంతో కాంగ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ వ్యక్తిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అతడి వివరాలు తెలుసుకున్నాడు. స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఫ్లోరిడాకు బయలుదేరాడు. అలా 750 కిలోమీటర్లు ప్రయాణించి తోటి గేమర్ నివాసానికి చేరుకున్నాడు.
ఇంటి తలుపులు తెరచి ఉండడంతో లోనికి వెళ్లాడు. అప్పుడే గది నుంచి బయటకు వస్తున్న యువకుడి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. ఇది గమనించిన బాధితుడి తండ్రి కాంగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి.. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం
బాధితుడికి ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఇలాంటి ఘర్షణల నేపథ్యంలో యూరప్, నార్త్ అమెరికాలో తమ సర్వర్లను నిలిపివేస్తున్నట్లు సదరు గేమింగ్ సంస్థ ప్రకటించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పక్షపాత వైఖరి.. ఓటు బ్యాంకు కోణం’.. అమెరికా నివేదికను ఖండించిన భారత్
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. -
నాన్న చనిపోయాడని కట్టుకథ.. అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ
అమెరికాలో చదువుతోన్న ఓ భారత విద్యార్థి.. స్కాలర్షిప్ కోసం ఏకంగా తన తండ్రి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు వెలుగు చూసింది. -
దక్షిణ కొరియా నుంచి దిగుమతి.. ఉత్తర కొరియాకు బహుమతి..!
రెండు ఖరీదైన కార్లను ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin).. కిమ్ (Kim Jong Un)కు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఉత్తర కొరియా శత్రుదేశం దక్షిణ కొరియా నుంచి తెప్పించిన విడిభాగాలను వాడినట్లు తెలుస్తోంది. -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. సురక్షిత స్థానాలకు వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీనికి అత్యంత సమీపంలోనే ఓ పాత మృత ఉపగ్రహం శకలాలుగా మారిపోయింది. ఇవి ఐఎస్ఎస్ (ISS) కు ముప్పు కావచ్చని తొలుత ఆందోళన చెందారు. -
ట్రంప్ దూకుడు.. బైడెన్ తడబాటు.. ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ
Biden Vs Trump: చివరి అధ్యక్ష ఎన్నికల తర్వాత బైడెన్, ట్రంప్ తొలిసారి ముఖాముఖి తలపడ్డారు. ఇద్దరి మధ్య వివిధ అంశాలపై వాడీవేడిగా చర్చ సాగింది. -
భారత్లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరం
భారత్లో తీసుకొస్తున్న మతమార్పిడి నిషేధ చట్టాలు, విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా వ్యాఖ్యానించింది. -
మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి!
మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి. -
క్షయ నిర్ధారణకు త్రీడీ వ్యవస్థ
మానవులు సహా క్షీరదాల ఊపిరితిత్తుల్లోని వాతావరణాన్ని పోలిన ‘త్రీడీ హైడ్రోజెల్ కల్చర్’ వ్యవస్థను బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐఐఎస్సీ) బయో ఇంజినీరింగ్ విభాగం విజయవంతంగా రూపొందించింది. -
కృత్రిమ మేధ సమాధానాలను గుర్తించడం కష్టమే
తరగతి గదిలో రోజూ పాఠాలు నేర్చుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థుల కంటే కృత్రిమ మేధ ఆధారిత చాట్బోట్లు అద్భుతంగా పరీక్షలు రాసేస్తున్నాయి! సమాధానాలను ఏఐతో రాసినట్లు గుర్తించడమే ఎగ్జామినర్లకు కష్టమవుతోంది. -
కమ్యూనిస్టు పార్టీ నుంచి.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులను బహిష్కరించిన చైనా
అవినీతి ఆరోపణలతో మాజీ రక్షణ మంత్రులైన వీ ఫెంగె, లీ షంగ్ఫులను అధ్యక్షుడు షి జిన్పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) నుంచి గురువారం బహిష్కరించారు. -
చంద్రుడి శిలలపై పరిశోధించండి
చంద్రుడి నుంచి చాంగే-6 వ్యోమనౌక తీసుకొచ్చిన శిలలపై పరిశోధనకు ముందుకు రావాలని వివిధ దేశాల శాస్త్రవేత్తలను చైనా అంతరిక్ష సంస్థ ఆహ్వానించింది. -
అంతరిస్తున్న జీవజాతుల్లో మరో వెయ్యి
ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఇది గత ఏడాదికన్నా ఇది 1,000 ఎక్కువ అని ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం’ (ఐయూసీఎన్) హెచ్చరించింది. -
సునాక్ విజయావకాశాలపై అనుమానం
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీని గెలిపించగలరా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. గడచిన ఐదు వారాల ఎన్నికల ప్రచారంలో ఆయన వేసిన తప్పటడుగులే ఈ సందేహానికి బలం చేకూరుస్తున్నాయి. -
సంక్షిప్త వార్తలు (4)
అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది ఆసియన్లు పెరిగారు. వీరిలో వలస వచ్చిన వారే అధికం. -
‘థాంక్యూ సర్’.. అన్నందుకు విమానం దించేశారు!
మహిళా సిబ్బందిని ఓ ప్రయాణికురాలు పొరబాటుగా పురుషుడిగా భావించింది. బోర్డింగ్ పాస్ అందించినందుకు ‘థాంక్యూ సర్’ అని చెప్పినందుకు విమానం నుంచి దించేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
రక్షణశాఖ మాజీ మంత్రులపై జిన్పింగ్ వేటు.. అవినీతే కారణం!
ఇద్దరు చైనా రక్షణశాఖ మాజీ మంత్రులపై అధికార కమ్యూనిస్ట్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్డ్ డే రూ.100 కోట్లుపైన వసూలు చేసిన చిత్రాలివే!
-
మాజీ సీఎస్ జవహర్రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
-
రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం.. తప్పుచేసిన ఎవరినీ వదలం: మంత్రి నాదెండ్ల
-
ఎయిమ్స్లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం