- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Biden-Trump debate: ట్రంప్-బైడెన్ ‘డిబేట్’.. కోట్లాది అమెరికన్లలో ఉత్కంఠ!
అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు. గురువారం (జూన్ 27న) జరిగే ఈ ‘డిబేట్’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వాషింగ్టన్: నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకోసం అక్కడ వాడీవేడి ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు. గురువారం (జూన్ 27న) జరిగే ఈ ‘డిబేట్’ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తున్న అమెరికన్లు.. టీవీలు, సోషల్ మీడియాల్లో ఈ చర్చను చూసేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దీంతో ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమొక్రటిక్ నేత బైడెన్, రిపబ్లికన్ నేత ట్రంప్.. నాలుగేళ్లలో తొలిసారిగా ముఖాముఖిగా తలపడనున్నారు. దీంతో వారు ఏయే అంశాలపై చర్చించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్ 27న అట్లాంటాలోని నెట్వర్క్ స్టూడియోస్లో 90 నిమిషాల పాటు జరిగే ఈ చర్చను టీవీల్లో లేదా సామాజిక మాధ్యమాల్లో చూడటం లేదా వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా సర్వే పేర్కొంది. ఇందుకోసం ప్రణాళిక కూడా వేసుకుంటున్నట్లు ప్రతీ పది మంది అమెరికన్లలో ఆరుగురు భావిస్తున్నట్లు చెప్పింది. కోట్లాది మంది అమెరికన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోందని అసోసియేటెడ్ ప్రెస్-ఎన్ఓఆర్సీ పరిశోధక సంస్థ సంయుక్తంగా చేపట్టిన సర్వే వెల్లడించింది. తమతమ అభ్యర్థిత్వాలను పరీక్షించుకునేందుకు వారికి ఇదొక పరీక్ష అని ఇరువురి మద్దతుదారులు భావిస్తున్నట్లు తెలిసింది.
ఇరువర్గాలకు ముఖ్యమే..
బైడెన్ ప్రచారం విజయానికి ఈ చర్చ అత్యంత ముఖ్యమని 47శాతం మంది అమెరికన్లు భావిస్తుండగా.. ట్రంప్నకూ ఇదెంతో కీలకమని ప్రతీ పది మందిలో నలుగురు చెబుతున్నారట. ఇది ఇద్దరికీ ఎంతో ముఖ్యమని పదిలో ముగ్గురు భావిస్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్కు ఇది మరింత కీలకమని 55శాతం మంది డెమోక్రట్లు చెబుతుండగా...51శాతం రిపబ్లికన్లు కూడా ట్రంప్పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తాజా సర్వే పేర్కొంది. అయితే, వృద్ధాప్యంలో ఉన్న ఈ ఇరువురు నేతలు అభ్యర్థులుగా ఉండటంపైనా ఇరు పార్టీల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పరోక్ష విమర్శలకే పరిమితమైన వీరిద్దరూ ముఖాముఖిగా తలపడనుండడంతో ఆ చర్చ ఏవిధంగా ఉండనుందనే విషయం ఆసక్తి రేపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
India-China: విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈసందర్భంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. -
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
ట్రంప్ (Trump)తో జరిగిన సంవాదంలో బైడెన్ (Biden) తడబాటుకు గురయ్యారు. దీని గురించి ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో అధ్యక్షుడు స్పందించారు. -
నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు. -
అణుసామర్థ్య స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తాం
అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికాను హెచ్చరించారు. -
స్మార్ట్ఫోన్ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకం
పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్ఫోన్ వంటి డిజిటల్ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు. -
ఐఎస్ఎస్లో కొద్దిసేపు ఎమర్జెన్సీ
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తప్పనిసరిగా బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది. -
చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు
చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది. -
అమెరికాలో కొవిడ్ కేసులు
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొవిడ్-19 కేసులు వెలుగుచూస్తుండడంతో ఇక్కడి సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
అమెరికా హెల్త్ కేర్ కుంభకోణంలో హైదరాబాద్ వైద్యుడు
అమెరికాలో చోటుచేసుకున్న భారీ ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్) కుంభకోణానికి సంబంధించి ఓ భారతీయుడు, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా 193 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. -
500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం
వాతావరణ మార్పుల వల్ల జూన్లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
నౌకలపై దాడులు ఆపండి
పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలిపివేయాలని హూతీ తిరుగుబాటుదారులను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ఓ తీర్మానం ఆమోదించింది. -
బైడెన్, ట్రంప్ వాడీవే‘ఢీ’
ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల చర్చ ఊహించినట్లే వాడీవేడిగా జరిగింది. -
ఆ దూషణలు నన్నెంతో బాధించాయి - రిషి సునాక్
రిఫార్మ్ పార్టీకి చెందిన ఓ నేత తనపై చేసిన జాత్యాహంకార దూషణలు ఎంతో బాధించాయని, ఆగ్రహం కూడా తెప్పించాయని రిషి సునాక్ పేర్కొన్నారు. -
‘పక్షపాత వైఖరి.. ఓటు బ్యాంకు కోణం’.. అమెరికా నివేదికను ఖండించిన భారత్
‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ’పై అమెరికా విడుదల చేసిన నివేదికను ఖండిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM