- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Israel Hamas Conflict: అప్పుడే హెచ్చరికలు.. అంతలోనే బాంబుల మోత.. ఖాన్ యూనిస్లో విధ్వంసం
గాజాలోని అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.
ఖాన్ యూనిస్: దక్షిణ గాజాలోని (South Gaza) ఖాన్ యూనిస్ (Khan younis) నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ (Hamas) ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు (Israel Army) మెరుపుదాడికి దిగాయి. స్థానిక ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఐడీఎఫ్ తుపాకుల మోత మోగించింది. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. 50 మందికిపైగా సామన్య ప్రజలకు గాయాలైనట్లు పేర్కొన్నారు. ఖాన్ యూనిస్ నగరాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సోమవారమే ఆదేశించింది. అంతలోనే దాడులకు పాల్పడటం గమనార్హం.
ఖాన్ యూనిస్ నుంచి ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు దిగారని, అందుకే ప్రతిదాడులు చేయాల్సి వచ్చిందని టెల్అవీవ్ సమర్థించుకుంటోంది. ఖాన్ యూనిస్లోని నిస్సార్ ఆస్పత్రిలో ఉగ్రవాదులు ఉన్నారని పసిగట్టిన ఇజ్రాయెల్ సేనలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకున్నాయి. ఖాళీ చేయాలని ముందే హెచ్చరించినందున కాల్పులకు దిగాయి. అప్పటికే చాలా వరకు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రక్రియ చివరి దశలో ఉండగానే సైన్యం బాంబుదాడులు చేసిందని నిస్సార్ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. దీనివల్లే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరోవైపు అక్కడికి దగ్గర్లోని యూరోపియన్ ఆస్పత్రి చుట్టుపక్కల భవనాలపైనా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఆ భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. అయితే, ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై స్పష్టత లేదు.
ఖాన్ యూనిస్ జనాభా 14 లక్షలు. గాజా జనాభాలో సగం ఇక్కడే ఉండేది. హమాస్ అంతమే లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్ 7న యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. డిసెంబర్లో ఈ నగరంపైకి సేనలను పంపించింది. హమాస్ ఉగ్రవాదులకు కీలక స్థావరంగా ఉన్న ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. ఒకప్పుడు భారీ భవంతులు, వాణిజ్య సముదాయాలతో కళకళలాడిన ఈ నగరం.. ఇజ్రాయెల్ దాడులతో నామరూపాల్లేకుండా పోయింది. ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ దళాలు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించాయి. దీంతో కొన్ని నెలలుగా తమ నివాసాలకు దూరంగా తలదాచుకున్న వేల కుటుంబాలు సొంత గూటికి తిరిగి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8, 9, 10వ తేదీల్లో రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్నారు. -
‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్ స్పష్టం
సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు. -
రిషి సునాక్కు మళ్లీ విజయం దక్కేనా? బ్రిటన్లో మొదలైన ఓటింగ్
Rishi Sunak: బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్కు రెండోసారి విజయం దక్కుతుందా, లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. -
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
Biden: బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను పోటీ నుంచి వైదొలగబోనని స్పష్టం చేశారు. -
న్యూయార్క్ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. -
తోషాఖానా కేసులో ఇమ్రాన్కు మరో ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)ను వెంటాడిన తోషాఖానా కేసులో మరో ఊరట లభించింది. -
బెంబేలెత్తించిన బెరిల్.. ద్వీపం ధ్వంసం!
కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. -
బ్రిటన్ పార్లమెంటు బరిలో భారత సంతతి అభ్యర్థుల హవా
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. గురువారం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ఎన్నికై పార్లమెంటులో అడుగడుపెట్టి చరిత్ర సృష్టించారు. -
భారతీయ విద్యార్థుల మద్దతుకు అమెరికాలో ప్రత్యేక ‘పోర్టల్’ వేదిక
అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్ కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. -
యుద్ధభూమిలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా పంపండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా కోరారు. -
ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా కమాండర్ మృతి
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. -
రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురి మృతి
తూర్పు ఉక్రెయిన్లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
సంక్షిప్త వార్తలు
అమెరికాలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు.. ట్రంప్ హయాంలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం అమల్లోకి వచ్చిన రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
మోదీవే అసత్య ప్రకటనలు.. చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
-
అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు
-
‘నీట్ను రద్దు చేయొద్దు’ - సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు
-
సీఎం రేవంత్రెడ్డి సూచనపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్
-
జగన్ జైలుకు పోయే సమయం ఆసన్నమైంది: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి