- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Indian Student: నాన్న చనిపోయాడని కట్టుకథ.. అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ
అమెరికాలో చదువుతోన్న ఓ భారత విద్యార్థి.. స్కాలర్షిప్ కోసం ఏకంగా తన తండ్రి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: తప్పుడు పత్రాలతో అమెరికాలో అడ్మిషన్ పొందిన ఓ భారతీయ విద్యార్థి నాటకం బయటపడింది. స్కాలర్షిప్ కోసం ఏకంగా తన తండ్రి చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించడం గమనార్హం. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి అధికారులు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. త్వరలోనే స్వదేశానికి పంపించనున్నారు.
భారత్కు చెందిన ఆర్యన్ ఆనంద్.. 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహీలో అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడు. పదో తరగతి పరీక్ష ఫలితాలనూ ఫోర్జరీ చేసిన అతడు.. పూర్తి స్కాలర్షిప్ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ.. ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు. ఇలా ఏడాది గడిచింది.
ట్రంప్ దూకుడు.. బైడెన్ తడబాటు.. ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ
ఈ క్రమంలో ‘అసత్యాలతోనే నా జీవితం మొత్తాన్ని నిర్మించుకున్నాను’ అంటూ సోషల్ మీడియాలో తన గురించి ప్రగల్భాలు పలుకుతూ ఓ పోస్టు పెట్టాడు. పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు, తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును పేర్కొన్నాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్షిప్ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్షిప్ల గురించి వివరించాడు.
ఈ విషయం అక్కడి అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జూన్ 12న ఆనంద్ను అరెస్టు చేశారు. ఈ కేసులో దాదాపు 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అయితే, యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో త్వరలోనే అతడు భారత్కు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
తమకు మరిన్ని దీర్ఘశ్రేణి ఆయుధాలు అందజేయాలని, గగనతల రక్షణ వ్యవస్థలు సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. పశ్చిమ దేశాలను కోరారు. -
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల వేళ.. అక్కడి హిందూ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. -
చనిపోయాక ‘గేట్స్’కు విరాళాలు ఉండవు - వారెన్ బఫెట్
తాను చనిపోయిన తర్వాత బిల్గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఉండవని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ పేర్కొన్నారు. -
తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
Nigeria: నైజీరియాలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. -
మరో యుద్ధ భయం?
పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనుందా.. ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగనున్నాయా? ఈ రెండింటి మధ్య నానాటికీ విస్తరిస్తున్న సాయుధ ఘర్షణలు మరో యుద్ధం తప్పదన్న విస్పష్ట సంకేతాల్ని వెలువరిస్తున్నాయి. -
ఉక్రెయిన్పై రష్యా దాడిలో 12 మంది మృతి
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో శనివారం రష్యా జరిపిన దాడుల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. డునిప్రొ డగ్ నగరంలోని అపార్ట్మెంటుపై శుక్రవారం జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. -
అవును...తడబడ్డాను
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండగా.. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. -
సుస్థిరాభివృద్ధి ఉప లక్ష్యాల సాధనలో ప్రపంచం వెనుకంజ
ప్రపంచంలో 700 కోట్లమంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 169 ఉప లక్ష్యాలలో కేవలం 17 శాతాన్ని మాత్రమే 2030 గడువుకల్లా సాధించగలుగుతామని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికలో పేర్కొంది. -
ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన
తక్కువ పోలింగ్ శాతం కారణంగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్ (రన్ఆఫ్ పోలింగ్)ను నిర్వహించబోతున్నారు. -
ఐక్యూ తక్కువైతే పక్షవాతం!
బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు యాభై ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారిన పడే ప్రమాదం ఎక్కువని ఇజ్రాయెల్లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధన హెచ్చరిస్తోంది. -
సెర్బియాలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద దాడి
సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీవద్ద విల్లులాంటి ఆయుధంతో వచ్చిన దుండగుడు భద్రతాధికారిపై దాడి చేసి గాయపరిచాడు. వెంటనే తేరుకున్న అధికారి కాల్పులు జరిపి నిందితుడిని హతమార్చారు. -
ఉక్రెయిన్పైకి ఉత్తరకొరియా ఆయుధాలు!
ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తరకొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తోందని ఓ పరిశోధన సంస్థ అధిపతి శుక్రవారం ఐరాస భద్రతా మండలికి తెలియజేశారు. -
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్
International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నాసా ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు రూ.7వేల కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జాగిలాల సాయంతో పబ్బుల్లో పోలీసుల తనిఖీలు
-
స్టాక్స్.. టీ20 కప్ విజయం మధ్య సారూప్యతేంటి?.. వివరించిన సెహ్వాగ్!
-
ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం
-
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
-
వరలక్ష్మీ శరత్కుమార్ పెళ్లి సందడి మొదలైంది.. ఫొటో చూశారా!