- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hurricane Beryl: బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
Hurricane Beryl: బెరిల్ హరికేన్ కరీబియన్ దీవుల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్లోని ‘యూనియన్ ఐలాండ్’ (Union Island) దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.
క్లిఫ్టన్: కరీబియన్ దీవుల్లో భీకర ‘బెరిల్’ హరికేన్ (Hurricane Beryl) భారీ విధ్వంసమే సృష్టించింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఐవాన్’ తర్వాత.. అంతటి భారీ హరికేన్ ఇదేనని స్థానిక అధికారిక యంత్రాంగం వెల్లడించింది. సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్లోని ‘యూనియన్ ఐలాండ్’ (Union Island) దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 90 శాతం ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉన్న ఒక్క విమానాశ్రయం పైకప్పు మొత్తం ఎగిరిపోయిందని స్వయంగా ప్రధానమంత్రి రాల్ఫ్ గోన్సాల్వ్స్ వెల్లడించారు.
కరీబియన్ దీవుల్లో ఒకటైన యూనియన్ ఐలాండ్ (Union Island) పొడవులో మూడు మైళ్లు, వెడల్పులో ఒక మైలు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 3,000 నివాసాలు ఉన్నాయి. బెరిల్ సృష్టించిన విధ్వంసంలో విలవిల్లాడిన ఈ దీవి ఇప్పుడు దాదాపు కనుమరుగైన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోయారు. ఇప్పటివరకు ఈ దీవిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పక్కనే ఉన్న బెఖియా దీవిలోనూ తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. తాగునీరు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు రాల్ఫ్ వెల్లడించారు. పునరుద్ధరణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
యూనియన్ ఐలాండ్ (Union Island) పునర్నిర్మాణానికి బిలియన్ల డాలర్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. దాదాపు ఏడాది కాలం పట్టొచ్చని తెలిపారు. వెంటనే తగిన చర్యలు చేపడతామని రాల్ఫ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర అందుకు సరిపడా నిధులు ఉన్నాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాము తీవ్ర సంక్షోభంలో ఉన్నామని.. ఆపన్నహస్తం అందించాలని కరీబియన్కు చెందిన ప్రవాసులను యూనియన్ ఐలాండ్ పర్యావరణ కూటమి డైరెక్టర్ కత్రినాకాయ్ విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ కిట్లు, ఆహారం, పునరావాస సౌకర్యాలు అత్యవసరంగా కావాల్సి ఉందని తెలిపారు. తాగునీటి కోసం తాము ఏళ్లుగా చేసిన కృషి మొత్తం బెరిల్ తుడిచిపెట్టేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ (Hurricane Beryl) సోమవారం తీవ్రరూపం దాల్చింది. బార్బడోస్, సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్ దీవులను కుదిపేసింది. ప్రస్తుతం దీని తీవ్రత కేటగిరీ-4కు తగ్గిందని నేషనల్ హరికేన్ కేంద్రం తెలిపింది. జమైకా దిశగా సాగుతున్నట్లు వెల్లడించింది.
బయలుదేరిన టీమ్ఇండియా..
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన టీమ్ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకోనున్నారు. బెరిల్ హరికేన్ కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో రోహిత్శర్మ సేన, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబసభ్యులు రెండ్రోజులుగా బార్బడోస్లోనే ఉన్నారు. వాతావరణం మెరుగవడంతో అక్కడున్నవాళ్లంతా ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి బుధవారం బయల్దేరారు. గురువారం ఉదయం విమానం దిల్లీ చేరుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆటగాళ్లందరూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధ్యత వహించినా.. సునాక్ కేవలం బాధితుడేనా!
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ.. అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
యూకే ఎన్నికల ఫలితాలు.. రిషి సునాక్పై మోదీ పోస్టు
యూకే ఎన్నికల ఫలితాల వేళ.. దాదాపు రెండేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్ (Rishi Sunak)ను ఉద్దేశించి మోదీ(Modi) పోస్టు పెట్టారు. -
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
AI Candidate In UK Elections: బ్రిటన్ ఎన్నికల ప్రచార సమయంలో ‘ఏఐ స్టీవ్’ అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
నిద్ర సరిపోవట్లేదు.. రాత్రి 8 తర్వాత రాలేను: బైడెన్
వరుస కార్యక్రమాలతో తాను అలసిపోతున్నానని, అర్ధరాత్రి వరకు ప్రచారాలు వద్దని బైడెన్ (Biden) అన్నారు. -
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
విమానాశ్రయంలో గ్యాస్ లీక్ అవ్వడంతో పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ (Rishi Sunak) నేతృత్వం వహిస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీనిపై ఆయన స్పందించారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం
UK elections: యూకేలో గురువారం రాత్రి సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. -
సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ!
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. -
బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం
జపాన్లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. -
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన.. -
దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. -
వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. -
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. -
షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉక్రెయిన్కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. -
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. -
ఏ పనీ చిన్నది కాదు.. నిబద్ధతతో చేయడమే ముఖ్యం
మనం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి. -
పారిస్లోని ‘గాలరీలఫాయెట్’లో యూపీఐ సేవలు
పారిస్లోని ప్రముఖ షాపింగ్మాల్.. ‘గాలరీ లఫాయెట్’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డెవిల్ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు
-
నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.. ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
-
కృష్ణాడెల్టాకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదు: మంత్రి నిమ్మల
-
33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!