Hezbollah Attack: ఇజ్రాయెల్‌ పైకి 200 రాకెట్లు.. హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు!

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా 200కుపైగా రాకెట్లు ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది.

Published : 04 Jul 2024 19:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ (Israel), లెబనాన్‌లోని హెజ్‌బొల్లా (Hezbollah)ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రూప్‌ సీనియర్‌ కమాండర్‌ మహమ్మద్‌ నామేహ్‌ నజీర్‌ను ఓ వైమానిక దాడిలో ఇజ్రాయెల్‌ హతమార్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా 200కు పైగా రాకెట్లు, 20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. గాజాలో పోరు ప్రారంభమైన తర్వాత ఈ గ్రూపు జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. లెబనాన్‌ భూభాగం నుంచి కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని, చాలా వాటిని కూల్చేసినట్లు టెల్‌అవీవ్‌ తెలిపింది.

రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి

హెజ్‌బొల్లా దాడుల అనంతరం ఇజ్రాయెల్‌ సైన్యం కూడా దక్షిణ లెబనాన్‌ ప్రాంతంపై విరుచుకుపడింది. రామ్యెహ్‌, హూలా పట్టణాల్లోని ఆ గ్రూపు మిలిటరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపినట్లు వెల్లడించింది. హూలాపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు లెబనాన్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌ 7న హమాస్‌ విధ్వంసం సృష్టించిన తర్వాత.. ఇజ్రాయెల్‌ పెద్దఎత్తున ప్రతి దాడులకు దిగుతోంది. హమాస్‌కు మద్దతిస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాదులనూ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ గ్రూపునకు ఆర్థికంగా, ఆయుధపరంగానూ ఇరాన్‌ సాయం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని