- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది.
ఎస్సీవో సదస్సులో భారత్ పిలుపు
ఆస్తానా: ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. పరోక్షంగా పాకిస్థాన్, చైనాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసింది. కజఖ్స్థాన్ రాజధాని ఆస్తానా వేదికగా గురువారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 24వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ సందేశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చదివి వినిపించారు. ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే.. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారుతుందని అందులో హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు క్రియాశీల చర్యలు అవసరమని సూచించారు. అనుసంధానత, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను అన్ని దేశాలూ గౌరవించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. చైనాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. మరోవైపు- పర్యావరణంలో ప్రతికూల మార్పులు ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళనకరంగా మారాయని జైశంకర్ పేర్కొన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అందుకునేందుకు భారత్ కృషిచేస్తోందని, పర్యావరణ హిత మౌలిక వసతులను వేగంగా సమకూర్చుకుంటోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెంపు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వంటి చర్యలను అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. తాజా సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తదితర నేతలు పాల్గొన్నారు. బెలారస్ గురువారం ఎస్సీవోలో చేరింది.
- పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సదస్సులో ప్రసంగిస్తూ.. ఎస్సీవో సభ్యదేశాలకు ఉగ్రవాదం అతిపెద్ద ఆందోళనకర అంశంగా మారిందన్నారు. అఫ్గానిస్థాన్లోని తాలిబన్ సర్కారుతో అన్ని దేశాలూ అర్థవంతమైన సంబంధాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
- సభ్యదేశాల భద్రతపై ఎస్సీవో దృష్టిసారిస్తుందని పుతిన్ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. వేర్పాటువాదం, తీవ్రవాదంపై పోరు కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.
- ఎస్సీవో మండలి విస్తరిత ఫార్మాట్ సమావేశంలోనూ ప్రధాని మోదీ సందేశాన్ని జైశంకర్ చదివి వినిపించారు. ఇరాన్లోని చాబహర్ ఓడరేవు అబివృద్ధిలో భారత్ సాధించిన పురోగతి భూ పరివేష్ఠిత మధ్య ఆసియా దేశాలకు చాలా విలువైనదిగా మారడమే కాకుండా, భారత్-యూరేసియా మధ్య వాణిజ్యానికి సమస్యలు తలెత్తకుండా చూస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధి ఇంజిన్లలో ఒకటిగా ‘మేకిన్ ఇండియా’ మారగలదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అది ఊతమివ్వగలదని వ్యాఖ్యానించారు.
- ఎస్సీవో ప్రభుత్వాధినేతల తదుపరి సమావేశానికి పాకిస్థాన్ వచ్చే ఏడాది అక్టోబరులో ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ సమావేశానికి భారత ప్రధానిని కూడా ఆహ్వానిస్తామని పాక్ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర