- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది.
బీరుట్: ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. బుధవారం హెజ్బొల్లా సీనియర్ కమాండర్ మహమ్మద్ నామెహ్ నాసిర్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భారీస్థాయిలో రాకెట్లు ప్రయోగించినా, తమకు ఎలాంటి తీవ్రనష్టం జరగలేదని టెల్ అవీవ్ పేర్కొంది. చాలా రాకెట్లను మధ్యలోనే అడ్డుకున్నామని తెలిపింది.
హమాస్ కొత్త ప్రతిపాదన
కాల్పుల విరమణకు సంబంధించి గతంలో ఇజ్రాయెల్ చేసిన ప్రతిపాదనకు హమాస్ కొన్ని సవరణలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ మిలిటెంట్ సంస్థ.. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్లకు పంపింది. ఇజ్రాయెల్ కూడా వీటిని పరిశీలిస్తోంది. ఈ కొత్త సవరణలపై అంగీకారం కుదిరే అవకాశాలు ఉన్నాయని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు గాజాలో మృతుల సంఖ్య 38 వేలు దాటింది. ఇజ్రాయెల్ భూతల, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం ఖాన్ యూనిస్లోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లకు గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
‘మీరు భలే ఉంటారు...’! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన