- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన..
తేల్చిచెప్పిన శ్వేతసౌధం
పోటీలో ఉండేది ఆయనేనని స్పష్టీకరణ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. బైడెన్ తప్పుకొనే ప్రశ్నే తలెత్తదన్నారు. బరిలో ఉంటున్న విషయాన్ని తాజా ప్రచారంలోనూ ఆయన స్పష్టంచేశారని కరీన్ గుర్తుచేశారు. ప్రచారాన్ని నిలిపివేసి రాజీనామా చేసే ఉద్దేశమేదీ ఆయనకు లేదని, బాధ్యతల్ని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అప్పగించే చర్చలేమీ జరగలేదని ఖండించారు. బైడెన్ అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆందోళనలు వ్యక్తమవడం సహజమే అయినప్పటికీ.. ఆయన నాలుగేళ్ల పనితీరును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆయన సేవలను మరవొద్దని, మరో నాలుగేళ్ల పాటు బైడెన్ సమర్థంగా పనిచేయగలరని భావిస్తున్నామని చెప్పారు. ఆయనకున్న పాలనానుభవం మరెవరికీ లేదని, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఇంకా పని చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. జలుబు, ప్రయాణ అలసటవల్ల ఆయన డస్సిపోయినా నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాంటారని చెప్పారు. పనిచేయడంపైనే ఆయన దృష్టి ఉందని, బయట వ్యాప్తిలో ఉన్నవన్నీ వదంతులేనని స్పష్టీకరించారు.
చాలాసార్లు కిందపడ్డా పైకి లేచాను: బైడెన్
‘‘డెమోక్రటిక్ పార్టీ నామినీని నేనే. తుదివరకు పోరాడతా. మనమే గెలవబోతున్నాం. ట్రంప్ను ఓడించేందుకు మాకు అండగా నిలవండి’’ అని మద్దతుదారులకు పంపిన ఈ-మెయిల్లో బైడెన్ పిలుపునిచ్చారు. ‘‘జీవితంలో నేను చాలాసార్లు కింద పడ్డాను. పైకి లేచి పోరాడాను. ఎన్నిసార్లు పడిపోయావన్నది కాదు.. ఎంత వేగంగా కోలుకున్నావనేదే ముఖ్యమని మా నాన్న చెబుతుండేవారు. అమెరికా సైతం వెనకబడిన ప్రతిసారీ బలంగా పుంజుకొని తానేంటో నిరూపించుకుంది. నేనూ అదే చేయబోతున్నాను. 2020 మాదిరిగానే కమలాహారిస్తో కలిసి ట్రంప్ను నేనిప్పుడు ఓడించబోతున్నాను. అది అంత సులభం కాదు. దానికి మీ మద్దతు కావాలి’’ అని బైడెన్ రాసుకొచ్చారు.
బైడెన్ కంటే ట్రంప్నకే ఎక్కువ మద్దతు!
బైడెన్ కంటే ట్రంప్ దాదాపు 6 శాతం ఎక్కువగా మద్దతు పొందుతున్నారని వాల్స్ట్రీట్ జర్నల్ తాజా సర్వే అంచనా వేసింది. వృద్ధాప్యం రీత్యా మరోసారి పగ్గాలు చేపట్టడం బైడెన్కు కష్టమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. కమలా హారిస్కు అంతగా ఆదరణ లేదంది. బైడెన్ తన తొలివిడత పదవీకాలాన్నే పూర్తిచేసేలా లేరని, ఆయనకు ఓటు వేయడమంటే హారిస్ను ఎన్నుకున్నట్లేనని ఓ ప్రముఖ విలేకరి ప్రశ్నించడంపై భారతీయ అమెరికన్ రాజకీయవేత్త నిక్కీ హేలీ అభ్యంతరం తెలిపారు. ఏ ప్రాతిపదికన అలా అంటున్నారని తిరిగి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బరి నుంచి తప్పుకొనేదే లేదు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆందోళనలను కొట్టివేస్తూ నవంబరు అధ్యక్ష ఎన్నికలో తిరిగి పాలక డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. -
రక్తపోటు నియంత్రణకు ఈ నాలుగు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు లక్షణాలు బయటకు కనపడవు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యానికి దారితీసి నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తుంది. -
ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు
ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. -
పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు
వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. -
ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్టు సయీద్ జలీలీపై ఆయన భారీ మెజారిటీ సాధించారు. -
సత్వరం.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)ను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనని బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది ఉభయులకూ ప్రయోజనకరమని పేర్కొన్నారు. -
కీలక డిమాండ్పై హమాస్ వెనక్కి
గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్.. ఆ కీలక డిమాండ్పై వెనక్కి తగ్గింది. -
సంక్షిప్త వార్తలు
ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయని, ఇవి పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్ వాసులు
ఉత్తర ఉక్రెయిన్లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. -
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!