- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
న్యూయార్క్ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు.
వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. న్యూయార్క్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది ఇండియన్ అమెరికన్లను ఈ నమూనా ఆకట్టుకోనుంది. ఈ ఆలయ నమూనా 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉంటుందని విశ్వహిందూ పరిషత్ అమెరికా (వీహెచ్పీఏ) ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ తెలిపారు. అమెరికాలో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించడం ఇదే తొలిసారని అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్లో జరుపుకొనే ఈ ‘ఇండియా డే’ కవాతును స్వదేశానికి వెలుపల జరిగే వేడుకల్లోకెల్లా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ 38వ వీధి నుంచి ఈస్ట్ 27వ వీధి వరకు కొనసాగే ఈ కవాతును ఏటా 1,50,000 మందికి పైగా తిలకిస్తారు. భారత సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఏ) నిర్వహించే ఈ కార్యక్రమం న్యూయార్క్ వీధుల్లో ఇండియన్ అమెరికన్ వర్గాల సాంస్కృతిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. -
విలయంలోనూ వీడని పుష్ప విలాసం!
ముగింపు కానరాని యుద్ధంలో... అంతులేని ఆవేదనలో... ఇళ్లు కూలుతున్నా.... తోటివారు రాలుతున్నా... తమ వంతెప్పుడో తెలియకున్నా... నష్టాలు... కష్టాలు గుట్టలుగా పేరుకుంటున్నా... మరిగిన జీవితాల్లో కన్నీరు ఇగిరిపోయినా... -
బ్రిటన్ నూతన ఆశాకిరణం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ (61) పేరు ఇంటా బయట మారుమోగిపోతోంది. -
టోరీల నిర్ణయాలే కొంపముంచాయా?
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం వెలగబెట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎంతమంది మారినా నేనిక్కడే!
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్ స్ట్రీట్ (10)లో అడుగుపెట్టిన కీర్ స్టార్మర్కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది. అదే ల్యారీ అనే పిల్లి. -
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. -
మీ ఆగ్రహం నన్ను తాకింది
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన సునాక్ పదవి నుంచి దిగిపోయారు. -
బ్రిటన్ ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి ఓటమి
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ) కూడా బరిలో నిలిచింది. ‘ఏఐ స్టీవ్’ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది. -
వెస్ట్బ్యాంకులో ఏడుగురి మృతి
వెస్ట్బ్యాంకులోని జెనిన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్లో ఏడుగురు మృతి చెందారని పాలస్తీనా అథారిటీ వర్గాలు తెలిపాయి. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది.