న్యూయార్క్‌ ‘ఇండియా డే’ కవాతులో.. అయోధ్య రామమందిర నమూనా

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు.

Published : 04 Jul 2024 06:41 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఆగస్టు 18న నిర్వహించనున్న చారిత్రక ‘ఇండియా డే’ కవాతులో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించనున్నారు. న్యూయార్క్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది ఇండియన్‌ అమెరికన్లను ఈ నమూనా ఆకట్టుకోనుంది. ఈ ఆలయ నమూనా 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉంటుందని విశ్వహిందూ పరిషత్‌ అమెరికా (వీహెచ్‌పీఏ) ప్రధాన కార్యదర్శి అమితాబ్‌ మిత్తల్‌ తెలిపారు. అమెరికాలో అయోధ్య రామమందిర నమూనాను ప్రదర్శించడం ఇదే తొలిసారని అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్‌లో జరుపుకొనే ఈ ‘ఇండియా డే’ కవాతును స్వదేశానికి వెలుపల జరిగే వేడుకల్లోకెల్లా  అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. న్యూయార్క్‌ నగరంలోని ఈస్ట్‌ 38వ వీధి నుంచి ఈస్ట్‌ 27వ వీధి వరకు కొనసాగే ఈ కవాతును ఏటా 1,50,000 మందికి పైగా తిలకిస్తారు. భారత సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఏ) నిర్వహించే ఈ కార్యక్రమం న్యూయార్క్‌ వీధుల్లో ఇండియన్‌ అమెరికన్‌ వర్గాల సాంస్కృతిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని