- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను.
విదేశీ పర్యటనలతో అలసిపోయాను
ట్రంప్తో సంవాదంపై బైడెన్ వ్యాఖ్యలు
సీఎన్ఎన్ పోల్లో కమలా హారిస్కు ఓటర్ల మద్దతు
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గతవారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. ‘సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలు చేశాను. ఆ ప్రభావం నాపై పడింది. అలసిపోయాను. చర్చ సమయంలో వేదికపైనే దాదాపు నిద్రపోయాను. నా ప్రదర్శనపై నెపాలు వెతకాలనుకోవడంలేదు. సంజాయిషీ మాత్రమే ఇస్తున్నాను’ అని తెలిపారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, బైడెన్ గతవారం అట్లాంటాలో తొలి ముఖాముఖి చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సంవాదంలో బైడెన్ చాలా సందర్భాల్లో తడబడ్డారు. దీంతో ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వంపై డెమోక్రట్లలో అంతర్మథనం మొదలైంది. బైడెన్ను మారుస్తారన్న కథనాలూ వస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థిపై సీఎన్ఎన్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న భారతీయ అమెరికన్ కమలా హారిస్వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. 81 ఏళ్ల బైడెన్తో పోలిస్తే ట్రంప్ను ఢీకొట్టే సత్తా 59 ఏళ్ల హారిస్కు మెరుగ్గా ఉందని ఈ పోల్ ద్వారా తేలింది. దీని ప్రకారం.. బైడెన్ కంటే ట్రంప్ 6 పాయింట్లు ముందున్నారు. ఓటర్లలో ట్రంప్నకు 47 శాతం మంది అనుకూలంగా ఉంటే హారిస్కు 45 శాతం మంది మద్దతు పలికారు. డెమోక్రటిక్ జాతీయ కమిటీ ప్రచార కార్యక్రమంలో బుధవారం బైడెన్, కమలా హారిస్ సంయుక్తంగా పాల్గొని తాము మరోసారి ఎన్నికయ్యేందుకు పోరాడుతున్నామని చెప్పారు. తాను డెమోక్రటిక్ పార్టీకి నేతనని, రేసు నుంచి వైదొలగాల్సిందిగా తనను ఎవరూ బలవంతం చేయలేరని బైడెన్ స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ (61) దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. -
విలయంలోనూ వీడని పుష్ప విలాసం!
ముగింపు కానరాని యుద్ధంలో... అంతులేని ఆవేదనలో... ఇళ్లు కూలుతున్నా.... తోటివారు రాలుతున్నా... తమ వంతెప్పుడో తెలియకున్నా... నష్టాలు... కష్టాలు గుట్టలుగా పేరుకుంటున్నా... మరిగిన జీవితాల్లో కన్నీరు ఇగిరిపోయినా... -
బ్రిటన్ నూతన ఆశాకిరణం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ (61) పేరు ఇంటా బయట మారుమోగిపోతోంది. -
టోరీల నిర్ణయాలే కొంపముంచాయా?
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్ పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం వెలగబెట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎంతమంది మారినా నేనిక్కడే!
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్ స్ట్రీట్ (10)లో అడుగుపెట్టిన కీర్ స్టార్మర్కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది. అదే ల్యారీ అనే పిల్లి. -
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి వ్యక్తుల హవా కొనసాగింది. రికార్డు స్థాయిలో 28 మంది అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. -
మీ ఆగ్రహం నన్ను తాకింది
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన సునాక్ పదవి నుంచి దిగిపోయారు. -
బ్రిటన్ ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి ఓటమి
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ) కూడా బరిలో నిలిచింది. ‘ఏఐ స్టీవ్’ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది. -
వెస్ట్బ్యాంకులో ఏడుగురి మృతి
వెస్ట్బ్యాంకులోని జెనిన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్లో ఏడుగురు మృతి చెందారని పాలస్తీనా అథారిటీ వర్గాలు తెలిపాయి. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది.