- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు
నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా.
వార్తాపత్రిక చదవడం ఇష్టం
నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా. ఈ పనులన్నీ నాకు చాలా ముఖ్యం. అవన్నీ పూర్తయ్యాక- రోజులో నా తొలి సమావేశాన్ని 10 గంటలకల్లా ప్రారంభిస్తా. ముఖ్యమైన భేటీలన్నీ మధ్యాహ్న భోజనానికి ముందే పూర్తయ్యేలా చూసుకుంటా.
జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకుడు
పెద్దయ్యేకొద్దీ సమయం ఖరీదైనదిగా మారుతుంది!
16-25 ఏళ్ల మధ్య వయసువారికి నాదొక సలహా. మీ శరీరాకృతిని తీర్చిదిద్దు కోవడంపై బాగా దృష్టిపెట్టండి. అందుకు మీకిప్పుడు అవసరమయ్యేది సమయం మాత్రమే. డబ్బు పెద్దగా అక్కర్లేదు. వయసు పెరిగేకొద్దీ సమయం అత్యంత ఖరీదైనదిగా మారుతుంది. కాబట్టి అది సులభంగా అందుబాటులో ఉండి.. మీపై బాధ్యతలు ఎక్కువగా లేని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
అలెక్స్ హార్మోజీ, పెట్టుబడిదారుడు
బైడెన్ కొనసాగడం కష్టమే!
బైడెన్ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం కష్టమే అనిపిస్తోంది. ట్రంప్తో సంవాదంలో తడబడినప్పటికీ.. ఆయనకు మద్దతిస్తూ బరాక్ ఒబామా ఇటీవల ట్వీట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఒబామాకు కూడా బైడెన్ గెలుస్తారన్న నమ్మకం లేదు. తన అంతరంగికులతో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. గ్రెచెన్ వైట్మర్ వంటి భవిష్యత్తు తరం డెమోక్రాటిక్ నేతలు ఈ పరిస్థితిని తమకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. బైడెన్ వైదొలగాలంటూ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.
టకర్ కార్ల్సన్, అమెరికా రాజకీయ వ్యవహారాల నిపుణుడు
పనికి తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దట్లేదు
పీహెచ్డీ చేసినవారు బంట్రోతు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం, సివిల్ ఇంజినీరింగ్ చదివినవారు ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా పనిచేయడం వంటివి భారత్లో మామూలు విషయాలే. ఇక్కడ విద్యతో ఇబ్బంది లేదు. పనికి అవసరమైనట్టు విద్యార్థులను తీర్చిదిద్దకపోవడమే అసలు సమస్య. మన దేశంలో లక్షల మంది ఇంజినీరింగ్ పట్టభద్రులున్నా.. తమ సంస్థలో పనిచేసేందుకు చైనా ఉద్యోగులకు వీసాలివ్వాలంటూ అదానీ గ్రూప్ ఇటీవల దరఖాస్తు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అక్షత్ శ్రీవాస్తవ, మేనేజ్మెంట్ కన్సల్టెంట్
సరికొత్త క్షిపణిని పరీక్షించాం: ఉత్తర కొరియా
సియోల్: భారీ వార్హెడ్ను మోసుకెళ్లగల సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా మంగళవారం ప్రకటించింది. దక్షిణ కొరియా అధికారులు, నిపుణులు మాత్రం దీన్ని ఖండించారు. హ్వాసాంగ్పో-11 డీఏ-4.5 క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఇది 4.5 టన్నుల వార్హెడ్ను మోసుకెళ్లగలదని పేర్కొంది. ఈ అస్త్రం.. గరిష్ఠంగా 500 కిలోమీటర్లు, కనిష్ఠంగా 90 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ!
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. -
బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం
జపాన్లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. -
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన.. -
దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. -
వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. -
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. -
షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉక్రెయిన్కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. -
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. -
ఏ పనీ చిన్నది కాదు.. నిబద్ధతతో చేయడమే ముఖ్యం
మనం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి. -
పారిస్లోని ‘గాలరీలఫాయెట్’లో యూపీఐ సేవలు
పారిస్లోని ప్రముఖ షాపింగ్మాల్.. ‘గాలరీ లఫాయెట్’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.