- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నేపాల్లో కూలనున్న ప్రచండ సర్కారు
నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
కాఠ్మాండూ: నేపాల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ (69) నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా (78), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ - యూనిఫైడ్ మార్క్సిస్ట్ - లెనినిస్ట్ (సీపీఎన్-యుఎంఎల్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి (72) కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని సోమవారం రాత్రి ఓ నిర్ణయానికి వచ్చారు. అయినా ప్రధాని ప్రచండ రాజీనామా చేయడానికి మంగళవారం కూడా నిరాకరించారు. రాజీనామా చేయడం కన్నా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటానని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పార్లమెంటు విశ్వాసాన్ని పొందడానికి 30 రోజుల గడువు ఉంటుంది. గత ఏడాదిన్నరగా అధికారంలో ఉన్న ప్రచండ ఇప్పటికే మూడుసార్లు విశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రచండ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును ఓలి సారథ్యంలోని సీపీఎన్-యుఎంఎల్ నాలుగు నెలల క్రితం ఉపసంహరించుకోవడంతో సర్కారు కూలిపోయే పరిస్థితి తలెత్తింది. 2024-25 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్పై అసంతృప్తితోనే ఓలి మద్దతు ఉపసంహరించారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఓలి పార్టీ మంత్రులు సైతం రాజీనామా చేయనున్నారు. ప్రచండ సంకీర్ణం కూలిపోయిన తరవాత తాము ఏర్పాటుచేసే కొత్త జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని సవరించాలని దేవ్ బా, ఓలి నిర్ణయించారు. పార్లమెంటు పదవీకాలంలో మిగిలిన మూడేళ్లకు ఉభయులూ రొటేషన్ పద్ధతిపై ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తారు. 275 సీట్లు గల నేపాల్ పార్లమెంటులో దేవ్ బా నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. ఓలి పార్టీకి వచ్చిన 78 సీట్లను కలుపుకొంటే మొత్తం 167 సీట్లతో మెజారిటీ లభిస్తుంది. సాధారణ మెజారిటీ 138 సీట్లకన్నా ఇది ఎక్కువే. నేపాల్లో గడచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారాయంటే అక్కడి రాజకీయాలు ఎంత అస్థిరమో అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు
ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. -
వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. -
సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ!
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. -
ఆ దేశాలను ఉపేక్షించొద్దు
ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలను ఏకాకులుగా మార్చాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే దేశాలనూ బహిరంగంగా ఎండగట్టాలని సూచించింది. -
షికాగోలో కాల్పులు.. ఇద్దరు మహిళల మృతి
అమెరికాలోని షికాగో సమీపంలో గ్రాండ్ క్రాసింగ్ వద్ద గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. గాయపడిన మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉక్రెయిన్కు మరో ఎదురుదెబ్బ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్ యార్ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. -
ఇజ్రాయెల్పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడి
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. -
బైడెన్ వైదొలగేదే లేదు
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖిలో బైడెన్ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన.. -
ఏ పనీ చిన్నది కాదు.. నిబద్ధతతో చేయడమే ముఖ్యం
మనం చేసే ఏ పనీ చిన్నది కాదు. నిబద్ధతతో పనిచేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. పని చేయడమే గౌరవం తప్ప పనిని బట్టి గౌరవం ఉండదు. అందుకే మీ వృత్తి గురించి చెప్పుకోవడానికి నామోషీగా భావించకండి. -
పారిస్లోని ‘గాలరీలఫాయెట్’లో యూపీఐ సేవలు
పారిస్లోని ప్రముఖ షాపింగ్మాల్.. ‘గాలరీ లఫాయెట్’లో యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం
జపాన్లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. -
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
Milk price in pak: పాకిస్థాన్లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.